CM Jagan: జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బస్సు యాత్ర రెండో రోజు కూడా జోరుగా సాగుతోంది.
Updated on: Mar 28, 2024 | 3:47 PM

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

సీఎం జగన్ రెండోరోజు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్ల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో దాదాపు గంటకు పైగా మాట్లాడారు. అక్కడి నుంచి దీబగుంట్లకు చేరుకున్నారు.

దీబగుంట్ల నుంచి నూనెపల్లి క్రాస్ దగ్గరకు చేరుకుని.. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం నాలుగున్నరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు జగన్.

సభ తర్వాత.. పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, నాగలాపురం మీదుగా పెంచికలపాడులో నైట్ క్యాంప్కు చేరుకుంటారు సీఎం జగన్.

జగన్ బస్సు యాత్రకు రెండో రోజుకు కూడా ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సీఎం జగన్ నేరుగా తమ వద్దకే రావడంతో అన్ని వర్గాల ప్రజలను ఆయన్ను చూసేందుకు బారులు తీరుతున్నారు.