Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ శివాలయం దేశంలోనే ప్రత్యేకం..! ఇక్కడి నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతోంది..!! రహస్యం ఏంటంటే..

భారతదేశంలోని అనేక దేవాలయాలు ఎన్నో అద్భుతాలు, రహస్యాలతో నిండి ఉన్నాయి. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీ యాగంటి ఉమా మహేశ్వర ఆలయం. దీనిని 15వ శతాబ్దంలో సంగమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్క నిర్మించారు. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న నంది విగ్రహం ప్రఖ్యాతి పొందింది.

Jyothi Gadda

|

Updated on: Apr 29, 2023 | 8:54 PM

ఆలయంలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం నిగూఢమైన రీతిలో నిరంతరం పెరుగుతూ పోతుందని చెబుతారు. నంది విగ్రహం ఆకారం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతోంది. దీని కారణంగా ఆలయంలోని అనేక స్తంభాలను కూడా తొలగించాల్సి వచ్చింది.

ఆలయంలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం నిగూఢమైన రీతిలో నిరంతరం పెరుగుతూ పోతుందని చెబుతారు. నంది విగ్రహం ఆకారం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతోంది. దీని కారణంగా ఆలయంలోని అనేక స్తంభాలను కూడా తొలగించాల్సి వచ్చింది.

1 / 7
నంది విగ్రహం అసలు పరిమాణం చాలా చిన్నదని, అయితే దాని పరిమాణం పెరుగుతుండడంతో పురాత్తత్వా శాఖ దీనిపై పరిశోధనలు చేసింది. నంది విగ్రహం విస్తరిస్తుందని వారు తేల్చారు. అటువంటి రాయితోనే ఇక్కడి నంది విగ్రహాన్ని తయారు చేసినట్లు పరిశోధనలో వెల్లడైంది.

నంది విగ్రహం అసలు పరిమాణం చాలా చిన్నదని, అయితే దాని పరిమాణం పెరుగుతుండడంతో పురాత్తత్వా శాఖ దీనిపై పరిశోధనలు చేసింది. నంది విగ్రహం విస్తరిస్తుందని వారు తేల్చారు. అటువంటి రాయితోనే ఇక్కడి నంది విగ్రహాన్ని తయారు చేసినట్లు పరిశోధనలో వెల్లడైంది.

2 / 7
పురాతన కాలంలో అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో వేంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడని, అయితే ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో విగ్రహం కాలి గోరు విరిగిందని చెబుతారు. అగస్త్య మహర్షి శివుని గురించి తపస్సు చేసాడు. ఆ తరువాత శివుని ఆశీర్వాదంతో అగస్త్య మహర్షి ఉమా మహేశ్వరుడిని, నందిని స్థాపించాడని చెబుతారు.

పురాతన కాలంలో అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో వేంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడని, అయితే ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో విగ్రహం కాలి గోరు విరిగిందని చెబుతారు. అగస్త్య మహర్షి శివుని గురించి తపస్సు చేసాడు. ఆ తరువాత శివుని ఆశీర్వాదంతో అగస్త్య మహర్షి ఉమా మహేశ్వరుడిని, నందిని స్థాపించాడని చెబుతారు.

3 / 7
ఈ ఆలయంలో పుష్కరిణి అనే చెరువు కూడా ఉంది. ఇక్కడ నంది నోటి నుండి నీరు నిరంతరం వస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. అగస్త్య మహర్షి ఈ చెరువులో స్నానం చేసిన తర్వాతే శివుడిని పూజించాడని చెబుతారు.

ఈ ఆలయంలో పుష్కరిణి అనే చెరువు కూడా ఉంది. ఇక్కడ నంది నోటి నుండి నీరు నిరంతరం వస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. అగస్త్య మహర్షి ఈ చెరువులో స్నానం చేసిన తర్వాతే శివుడిని పూజించాడని చెబుతారు.

4 / 7
అయితే, ఇక్కడి శివాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది..ఏ శివాలయంలో అయినా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో శివుడు పార్వతీ సమేతంగా ఉండి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న అనేక విశిష్టతలలో ఇదీ ఒకటి.

అయితే, ఇక్కడి శివాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది..ఏ శివాలయంలో అయినా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో శివుడు పార్వతీ సమేతంగా ఉండి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న అనేక విశిష్టతలలో ఇదీ ఒకటి.

5 / 7
ఇక్కడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివుడికి ఎదురుగా నంది ఉండకుండా కొంచం పక్కకు ప్రతిష్టించబడి ఉంటుంది. కారణమేమంటే ఇక్కడ శివుడితో పాటు శక్తిరూపమైన పార్వతీ కూడా ఉండటమే. శక్తికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు కాబట్టే నందీశ్వరుడు పక్కకు ప్రతిష్టించబడి ఉంటాడు.

ఇక్కడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివుడికి ఎదురుగా నంది ఉండకుండా కొంచం పక్కకు ప్రతిష్టించబడి ఉంటుంది. కారణమేమంటే ఇక్కడ శివుడితో పాటు శక్తిరూపమైన పార్వతీ కూడా ఉండటమే. శక్తికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు కాబట్టే నందీశ్వరుడు పక్కకు ప్రతిష్టించబడి ఉంటాడు.

6 / 7
ఈ ఆలయంలో పుష్కరిణి అనే చెరువు కూడా ఉంది. అగస్త్య మహర్షి ఈ చెరువులో స్నానం చేసిన తర్వాతే శివుడిని పూజించాడని చెబుతారు.

ఈ ఆలయంలో పుష్కరిణి అనే చెరువు కూడా ఉంది. అగస్త్య మహర్షి ఈ చెరువులో స్నానం చేసిన తర్వాతే శివుడిని పూజించాడని చెబుతారు.

7 / 7
Follow us