AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Central Contracts: ఇషాన్ కిషన్-శ్రేయాస్ అయ్యర్‌లకు బీసీసీఐ భారీ షాక్.. ఆ లిస్ట్ నుంచి ఔట్?

Ishan Kishan - Shreyas Iyer: BCCI 2023-24 సీజన్ కోసం BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌లకు లోబడి ఉన్న ఆటగాళ్ల జాబితాను మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, పదేపదే హెచ్చరించినా రంజీ ట్రోఫీ ఆడనందుకు శిక్షగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఈ జాబితా నుంచి మినహాయించాలని నిర్ణయించారు.

Venkata Chari
|

Updated on: Feb 24, 2024 | 12:44 PM

Share
టీమ్ ఇండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ టైమింగ్ సరిగా లేదని చెప్పొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైనప్పటి నుంచి కిషన్‌ భారత్‌ తరపున ఆడలేదు. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్టు నుంచి అయ్యర్‌ను తొలగించారు.

టీమ్ ఇండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ టైమింగ్ సరిగా లేదని చెప్పొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైనప్పటి నుంచి కిషన్‌ భారత్‌ తరపున ఆడలేదు. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్టు నుంచి అయ్యర్‌ను తొలగించారు.

1 / 7
ఇషాన్ కిషన్-శ్రేయాస్ అయ్యర్ దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్ ఆడాలని BCCI ఆదేశించినప్పటికీ, ఇద్దరు బ్యాట్స్‌మెన్ రంజీ ట్రోఫీలో ఆడలేదు. ఇప్పుడు దీనికి ఈ ఇద్దరు భారతీయ స్టార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

ఇషాన్ కిషన్-శ్రేయాస్ అయ్యర్ దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్ ఆడాలని BCCI ఆదేశించినప్పటికీ, ఇద్దరు బ్యాట్స్‌మెన్ రంజీ ట్రోఫీలో ఆడలేదు. ఇప్పుడు దీనికి ఈ ఇద్దరు భారతీయ స్టార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

2 / 7
నివేదిక ప్రకారం, 2023-24 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లకు లోబడి ఉన్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, పదేపదే హెచ్చరించినా రంజీ ట్రోఫీ ఆడనందుకు శిక్షగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఈ జాబితా నుంచి మినహాయించాలని నిర్ణయించారు. అంటే, వీరిద్దరికీ బీసీసీఐ నుంచి వార్షిక వేతనంగా రూ.1 లభించదు.

నివేదిక ప్రకారం, 2023-24 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లకు లోబడి ఉన్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, పదేపదే హెచ్చరించినా రంజీ ట్రోఫీ ఆడనందుకు శిక్షగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఈ జాబితా నుంచి మినహాయించాలని నిర్ణయించారు. అంటే, వీరిద్దరికీ బీసీసీఐ నుంచి వార్షిక వేతనంగా రూ.1 లభించదు.

3 / 7
"అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు 2023-24 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేశారు. దీనిని బీసీసీఐ త్వరలో ప్రకటిస్తుంది. కిషన్, అయ్యర్‌లు జాబితా నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వారు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. బీసీసీఐ ఆదేశించినా పట్టించుకోలేదని తెలుస్తోంది.

"అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు 2023-24 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేశారు. దీనిని బీసీసీఐ త్వరలో ప్రకటిస్తుంది. కిషన్, అయ్యర్‌లు జాబితా నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వారు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. బీసీసీఐ ఆదేశించినా పట్టించుకోలేదని తెలుస్తోంది.

4 / 7
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగే ఏకైక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై జట్టులో శ్రేయాస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. అయితే, అతను బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌కు అందుబాటులో లేడు.

ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగే ఏకైక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై జట్టులో శ్రేయాస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. అయితే, అతను బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌కు అందుబాటులో లేడు.

5 / 7
అలాగే, NCA స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్, అయ్యర్ ఆడటానికి ఫిట్‌గా ఉన్నారని, అయితే అతను కనిపించలేదని తెలిపాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రకటన షూటింగ్‌కు హాజరయ్యాడు. దీంతో బీసీసీఐ మండిపడినట్లు తెలుస్తోంది.

అలాగే, NCA స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్, అయ్యర్ ఆడటానికి ఫిట్‌గా ఉన్నారని, అయితే అతను కనిపించలేదని తెలిపాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రకటన షూటింగ్‌కు హాజరయ్యాడు. దీంతో బీసీసీఐ మండిపడినట్లు తెలుస్తోంది.

6 / 7
రాజ్‌కోట్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జైషా ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని, విఫలమైతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నాడు. దీంతో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రాజ్‌కోట్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జైషా ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని, విఫలమైతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నాడు. దీంతో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

7 / 7
Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..