- Telugu News Photo Gallery Cinema photos Trisha Krishnan to Akash Puri latest movie updates from film industry
Movie Updates: డ్యూయల్ రోల్లో త్రిష.. తండ్రి డైరెక్షన్పై ఆకాష్ కామెంట్స్.!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ కాంపౌండ్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్లో మూడో భాగం సిద్ధమవుతోంది. తండ్రి డైరెక్షన్లో నటించటంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు యంగ్ హీరో ఆకాష్ పూరి.
Updated on: Mar 12, 2024 | 9:18 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. తాజా హీరోయిన్ క్యారెక్టర్కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరి కొంత మంది హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.

లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ రూపొందుతోంది. ఇంత వరకు ప్రపంచంలో ఏ బయోపిక్కు పెట్టని స్థాయిలో ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు మేకర్స్. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. మైఖేల్ పాత్రలో ఆయన తమ్ముడి కొడుకు జాఫర్ జాక్సన్ నటిస్తున్నారు. ఆంటోయిన్ దర్శకత్వంలో గ్రాహం కింగ్ సినిమాను నిర్మిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ కాంపౌండ్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇటీవల టైరగ్ 3 సినిమాతో నిరాశపరిచిన భాయజాన్, బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఓ హిట్ పార్ములాను రిపీట్ చేస్తున్నారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కిక్ 2ను సెట్స్ మీదకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్లో మూడో భాగం సిద్ధమవుతోంది. చంద్రముఖికి రీమేక్గా తెరకెక్కిన భూల్ బులయ్యా బాలీవుడ్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్గా భూల్ బులయ్యా 2ను రూపొందించిన నార్త్ మేకర్స్ ఇప్పుడు మూడో భాగాన్ని ప్రారంభించారు. థర్డ్ పార్ట్లో కార్తిక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రీ, విద్యా బాలన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.

తండ్రి డైరెక్షన్లో నటించటంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు యంగ్ హీరో ఆకాష్ పూరి. ముందు నటుడిగా ప్రూవ్ చేసుకున్న తరువాతే తాను తండ్రి డైరెక్షన్లో నటిస్తా అన్నారు ఆకాష్. మెహబూబ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆకాష్, ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం నెక్ట్స్ మూవీకి సంబంధించిన కథా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.




