సామాన్య ప్రజలకు మున్ముందు మరింత భారం కానుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది.
1 / 4
కిరాణ సరుకులు, బట్టలు, ఎలక్ట్రానిక్ ఇలా పలు రకాల వస్తువుల ధరలు పెరగనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు 8 నుంచి 10 శాతం పెరిగే అవకాశాలున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
2 / 4
ఈ ధరలు రాబోయే సంవత్సరంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ఈ ధరలు పెరిగేందుకు ఆస్కారం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
3 / 4
ఈ క్రమంలో రిఫ్రిజిరేట్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ధరలు కూడా 5 నుంచి 6 శాతం పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇలా ధర పెరుగుదలతో సామాన్యులపై మరింత ప్రభావం పడనుంది.