‘అన్నమో రామ చంద్ర’.. బెజవాడలో ఆకలి కేకలు.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..

వాన తగ్గింది.. వరద శాంతిస్తోంది. కాని, కడుపులో ఆకలి మెలిపెడుతోంది. విజయవాడ సింగ్ నగర్‌లో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం 10 లక్షల ఆహార ప్యాకెట్లు, పాలు, మంచినీళ్లు అందిస్తున్నా.. పలుచోట్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ, పంపిస్తున్న లక్షల ఆహార ప్యాకెట్లు ఎటుపోతున్నాయి? ఎందుకని ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

|

Updated on: Sep 03, 2024 | 9:50 PM

వాన తగ్గింది.. వరద శాంతిస్తోంది. కాని, కడుపులో ఆకలి మెలిపెడుతోంది. విజయవాడ సింగ్ నగర్‌లో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం 10 లక్షల ఆహార ప్యాకెట్లు, పాలు, మంచినీళ్లు అందిస్తున్నా.. పలుచోట్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ, పంపిస్తున్న లక్షల ఆహార ప్యాకెట్లు ఎటుపోతున్నాయి? ఎందుకని ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

వాన తగ్గింది.. వరద శాంతిస్తోంది. కాని, కడుపులో ఆకలి మెలిపెడుతోంది. విజయవాడ సింగ్ నగర్‌లో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం 10 లక్షల ఆహార ప్యాకెట్లు, పాలు, మంచినీళ్లు అందిస్తున్నా.. పలుచోట్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ, పంపిస్తున్న లక్షల ఆహార ప్యాకెట్లు ఎటుపోతున్నాయి? ఎందుకని ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

1 / 5
ప్రతి ఒక్క వరద బాధితునికి ఆహారం అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఒకసారి ఇచ్చి వదిలేయడం కాదు.. మూడు పూటలా ఆహారం అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. విజయవాడలో వరద బాధితుల కోసం 5 లక్షల మందికి సరిపోయేలా.. మంగళగిరిలోని అక్షయపాత్ర భోజనం సిద్ధం చేస్తోంది. అటు, సింహచలం నుంచి 20 వేల పులిహోర ప్యాకెట్లు పంపించారు.

ప్రతి ఒక్క వరద బాధితునికి ఆహారం అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఒకసారి ఇచ్చి వదిలేయడం కాదు.. మూడు పూటలా ఆహారం అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. విజయవాడలో వరద బాధితుల కోసం 5 లక్షల మందికి సరిపోయేలా.. మంగళగిరిలోని అక్షయపాత్ర భోజనం సిద్ధం చేస్తోంది. అటు, సింహచలం నుంచి 20 వేల పులిహోర ప్యాకెట్లు పంపించారు.

2 / 5
ఇంత ఆహారం పంపిస్తున్నా సరే.. క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి ప్రజలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్తున్న వ్యాపారులు.. వాటిని సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. కొందరు వ్యాపారులు, ప్రైవేట్ బోట్ నిర్వాహకులు ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆహారం అయితే తెప్పిస్తున్నారు గానీ.. పంపిణీ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని, అధికారుల పర్యవేక్షణ లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌లో ఆహారం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు బాధితులు వాపోయారు.

ఇంత ఆహారం పంపిస్తున్నా సరే.. క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి ప్రజలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్తున్న వ్యాపారులు.. వాటిని సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. కొందరు వ్యాపారులు, ప్రైవేట్ బోట్ నిర్వాహకులు ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆహారం అయితే తెప్పిస్తున్నారు గానీ.. పంపిణీ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని, అధికారుల పర్యవేక్షణ లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌లో ఆహారం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు బాధితులు వాపోయారు.

3 / 5
మరోవైపు.. విజయవాడలో పాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దీంతో సమస్య పెరిగింది. ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. అరలీటర్ ప్యాకెట్ 70 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారని బాధితులు చెబుతున్నారు.

మరోవైపు.. విజయవాడలో పాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దీంతో సమస్య పెరిగింది. ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. అరలీటర్ ప్యాకెట్ 70 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారని బాధితులు చెబుతున్నారు.

4 / 5
లక్షల ప్యాకెట్ల ఆహారం తీసుకొస్తున్నా సరే.. పాలు, బ్రెడ్, ఆహారం కోసం వాహనాల వద్ద పెద్ద ఎత్తున ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆహారంతో వస్తున్న వాహనాలను సింగ్‌ నగర్‌ బ్రిడ్జ్‌ వద్దే ఆపేస్తున్నారు బాధితులు. దీంతో చివరి ప్రాంతాలకు ఆహారం అందడం లేదు. కనీసం 10 కాలనీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కేవలం బ్రిడ్జిపైన ఉన్న వాళ్లకే కాదు ముంపులో చిక్కుకున్న వారికి కూడా ఆహారం, మంచినీళ్లు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. అయితే.. చివరి ప్రాంతాల కోసం హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. జవావాసాలే టార్గెట్‌గా ప్యాకెట్లు కిందకి వదులుతున్నా.. కొన్ని చోట్ల బురద ప్రాంతాల్లో పడుతున్నాయి. దీంతో.. దీనిపైనా విమర్శలు చేస్తున్నారు కొందరు బాధితులు.

లక్షల ప్యాకెట్ల ఆహారం తీసుకొస్తున్నా సరే.. పాలు, బ్రెడ్, ఆహారం కోసం వాహనాల వద్ద పెద్ద ఎత్తున ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆహారంతో వస్తున్న వాహనాలను సింగ్‌ నగర్‌ బ్రిడ్జ్‌ వద్దే ఆపేస్తున్నారు బాధితులు. దీంతో చివరి ప్రాంతాలకు ఆహారం అందడం లేదు. కనీసం 10 కాలనీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కేవలం బ్రిడ్జిపైన ఉన్న వాళ్లకే కాదు ముంపులో చిక్కుకున్న వారికి కూడా ఆహారం, మంచినీళ్లు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. అయితే.. చివరి ప్రాంతాల కోసం హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. జవావాసాలే టార్గెట్‌గా ప్యాకెట్లు కిందకి వదులుతున్నా.. కొన్ని చోట్ల బురద ప్రాంతాల్లో పడుతున్నాయి. దీంతో.. దీనిపైనా విమర్శలు చేస్తున్నారు కొందరు బాధితులు.

5 / 5
Follow us