AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pralhad Joshi: బొగ్గు కొరత వల్ల భవిష్యత్తులో కరెంటు కోతలు ఉండవు: టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో మంత్రి ప్రహ్లాద్ జోషి

Pralhad Joshi: గత కొన్నేళ్లుగా మినరల్‌ సెక్టార్‌లో సామర్థ్యం మేరకు పనులు జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే..

Pralhad Joshi: బొగ్గు కొరత వల్ల భవిష్యత్తులో కరెంటు కోతలు ఉండవు: టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో మంత్రి ప్రహ్లాద్ జోషి
Minister Pralhad Joshi
Subhash Goud
|

Updated on: Jun 19, 2022 | 5:17 PM

Share

Pralhad Joshi: గత కొన్నేళ్లుగా మినరల్‌ సెక్టార్‌లో సామర్థ్యం మేరకు పనులు జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండు రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మంత్రులు పాల్గొన్నారు. ఇందులో మంత్రి ప్రహ్లాద్‌ జోషి పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత దేశంలోని గనులు దేశాభివృద్ధికి, ఉపాధికి అత్యంత దోహదపడుతున్నాయన్నారు. ఇంతకు ముందు ఖనిజాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఈ వ్యవస్థలో పారదర్శకత లేదు. గత సంవత్సరాల్లో మా సామర్థ్యానికి అనుగుణంగా పని చేయలేకపోయాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ రూల్ వల్ల 10-10 ఏళ్లుగా ప్రజలు ఉత్పత్తి చేయలేదని అన్నారు.

బొగ్గు కొరత వల్ల భవిష్యత్తులో కరెంటు కోతలు ఉండవని ప్రజలకు హామీ ఇస్తున్నాను అని అన్నారు. 2014 నుంచి భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా మెరుగుపర్చుకున్నట్లు చెప్పారు. డిమాండ్‌ పెరగడం వల్ల టీపీపీలో బొగ్గు నిల్వలు కొన్ని ప్రాంతాలలో దాదాపు ఐదారు రోజులు పడిపోయిన మాట వాస్తవమే. అయితే ఆ ఐదు రోజుల తర్వాత బ్లాక్‌అవుట్‌ వస్తుందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటేనని అన్నారు. బొగ్గు ఉత్పత్తి అనేది ప్రతి రోజు జరుగుతుంది. కొందరు వ్యక్తులు కేవలం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశం వివిధ టీపీపీలలో (థర్మల్‌ పవర్‌ ప్లాంట్స్‌) 11.5 రోజుల స్టాక్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా మా వద్ద 50-55 మిలియన్‌ టన్నుల బొగ్గు స్టాక్‌ ఉంది. ఏప్రిల్‌-మేలో బొగ్గు ఉత్పత్తి గతంతో పోలిస్తే 109 మిలియన్‌ టన్నుల రికార్డుకు గణనీయంగా మెరుగు పడింది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని పార్లమెంటులో తరచుగా అంతరాయం కలిగించడం గురించి ప్రశ్నించగా, వారు కోరుకున్న ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏ సమస్యనైనా చర్చించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మా ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. వారు నోటీసు ఇచ్చి చర్చకు కోరితే మేము దానికి సిద్ధంగా ఉన్నాము.. అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం ఉంది. మేము బిల్లు తీసుకువచ్చినప్పుడల్లా అన్ని పార్టీలతో చర్చిస్తాము. కొన్ని పార్టీలు సమస్యల ఆధారంగా మాకు మద్దతు ఇస్తాయి. ఫ్లోర్ కోఆర్డినేషన్‌తో మేము ముఖ్యమైన బిల్లులను ఆమోదించాము అని జోషి అన్నారు. దేశంలోని సహజ ఖనిజాలపై గనుల మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో 90 ముఖ్యమైన ఖనిజాలున్నాయన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నది ఖనిజ రంగం. ఆర్థిక వ్యవస్థకు అత్యధిక సహకారం అందిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే, భారతదేశం తన వద్ద ఉన్న వనరులలో కేవలం 10 శాతం మాత్రమే తవ్వుకుందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..