AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wonder: కరోనాతో అమ్మ చనిపోతే అడుక్కుతింటున్న చిన్నోడు.. ఊహించని రీతిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..

మాయదారి కరోనా.. ఆ అబ్బాయి తల్లిని కూడా మింగేసింది. అప్పటి వరకు అమ్మ ఒడిలో హాయిగా జీవిస్తూ వచ్చిన ఆ బాలుడు.. తల్లి మృతితో అనాధగా మారాడు. జీవితమంటే ఏంటో కూడా తెలియని ఆ అబ్బాయిని నా అన్న వారు ఎవరూ లేకపోవడంతో

Wonder: కరోనాతో అమ్మ చనిపోతే అడుక్కుతింటున్న చిన్నోడు.. ఊహించని రీతిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..
Boy Becomes Millionaire
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2022 | 7:03 PM

Share

మాయదారి కరోనా.. ఆ అబ్బాయి తల్లిని కూడా మింగేసింది. అప్పటి వరకు అమ్మ ఒడిలో హాయిగా జీవిస్తూ వచ్చిన ఆ బాలుడు.. తల్లి మృతితో అనాధగా మారాడు. జీవితమంటే ఏంటో కూడా తెలియని ఆ అబ్బాయిని నా అన్న వారు ఎవరూ లేకపోవడంతో చివరకు రోడ్డున పడి బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి రోజూ తన కడుపు నింపుకోవడానికి బిచ్చమెత్తుకునే వాడు. కానీ, ఆ బాలుడి కష్టాలు చూసి ఆ దేవుడికే జాలి పుట్టినట్లుంది. రాత్రికి రాత్రే కోట్ల విలువైన ఆస్తికి యజమాని అయ్యాడు ఆ బాలుడు. ఊహించని రీతిలో అతనికి భారీగా ఆస్తి దక్కింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రానూన్‌లో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలోని పండోలి గ్రామానికి చెందిన ఇమ్రానా భర్త నవేద్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆమెకు 10 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, అత్తింటి వారి వేధింపులు ఎక్కువ అవడంతో.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. 2019లోనే తన కొడుకు షాజెబ్‌తో కలిసి కలియార్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. అయితే, విధి వారిని వెంటాడింది. కరోనా మహమ్మారి.. ఇమ్రానా ను కబలించింది. ఇమ్రానా మృతి తరువాత షాజెబ్ అనాధ అయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచక, నా అన్నవారు లేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. గత్యంతరం లేక రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగించాడు. అయితే, ఇంతకాలంలో అతను పడిన అవస్థలు చూసి ఆ దేవుడికే గుండె బరువెక్కిందేమో. ఇక తట్టుకోలేక.. ఆ బాలుడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేశాడు.

అవును, ఆ బాలుడికి తన తండ్రి కుటుంబం ద్వారా వారసత్వ ఆస్తి లభించింది. షాజేబ్ తాత మహ్మద్ యాకూబ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. అయితే యాకూబ్ చనిపోయే ముందు.. తన ఆస్తిలో సగం వాటాను అబ్బాయి షాజేబ్ పేరు మీద రాశాడు. ఐదు బిగాల భూమి, ఓ ఇల్లును షాజేబ్ పేరిట రాశాడు యాకూబ్. దాంతో అతని కుటుంబ సభ్యులు.. షాజేబ్ కోసం తీవ్రంగా గాలించారు. సోషల్ మీడియాలో ప్రకటన కూడా ఇచ్చారు. ఇంతలో కలియార్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నాడని సమాచారం అందుకున్నారు బందువులు. ఆ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి బాలుడిని ఆరా తీయగా.. అసలు విషయం తెలిసిందే. దాంతో అతన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. దాంతో షాజేబ్ దుర్భర జీవితం నుంచి బయటపడ్డాడు. కాగా, ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం