Guess This Cricketer: క్రీజ్‌లోకి దిగితే మెరుపులే.. ఈ స్టార్ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టగలరా?

భారతదేశ పురుషులు క్రికెట్ జట్టులో అతనో స్టార్ ప్లేయర్. 2005లో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసిన అతను.. ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంటూ స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు.

Guess This Cricketer: క్రీజ్‌లోకి దిగితే మెరుపులే.. ఈ స్టార్ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టగలరా?
Suresh Rain
Follow us

|

Updated on: Dec 16, 2022 | 9:26 PM

భారతదేశ పురుషులు క్రికెట్ జట్టులో అతనో స్టార్ ప్లేయర్. 2005లో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసిన అతను.. ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంటూ స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. టీమిండియా స్టార్ కెప్టెన్ ధోనీకి అత్యంత సన్నిహితుడు. ధోనీని దైవంలా భావించే ఈ స్టార్ క్రికెటర్.. భారత జట్టు ఖాతాలో నమోదైన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎప్ట్ హ్యాండర్ అయిన ఈ క్రికెటర్.. అటు వన్డేలు, ఇటు టీ20 మ్యాచ్‌ల్లో దుమ్మురేపే ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి ఫినిషర్‌గా రాణించిన అతను.. ఒకనొక దశలో జట్టుకు దూరమయ్యాడు. ఆ తరువాత 2008లో ప్రారంభమైన టీ20 క్రికెట్ మ్యాచ్‌లతో మళ్లీ పుంజుకున్నాడు. తొలి సీజన్‌లో చైన్నై ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి అతన్ని దక్కించుకుంది. ఆ సీజన్‌లో అతని ప్రదర్శన పీక్స్‌కు చేరింది. అదే అతని క్రికెట్ కెరీర్‌ను నిలబెట్టింది కూడా. మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అటు ఐపీఎల్ టీ20 మ్యాచుల్లో, ఇటు.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అదరగొట్టాడు. ఆ స్టార్ క్రికెటరే సురేష్ రైనా.

భారత క్రికెట్ టీమ్‌లో స్టార్ ప్లేయర్‌గా రాణించిన సురేష్ రైనా.. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది కాలానికే తాను కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. తొలుత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా.. ఆ తరువాత ఐపీఎల్‌తో పాటు, భారత టీ20 లీగ్ సహా ఇతర దేశవాళీ పోటీల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అప్పటి నుంచి రైనా.. వ్యాపార కార్యకలాపాల్లో, వాణిజ్య ప్రకటనల్లో, ఇతర పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ‘బిలీవ్’ పేరుతో సురేష్ రైనా ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. అయితే క్రికెట్‌కు దూరమైనా.. అభిమానులకు మాత్రం దూరమవలేదు రైనా. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటున్నాడు. తన అప్‌డేట్స్ అన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. తాజాగా ఓ పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సురేష్ రైనా. అది బాగా వైరల్ అవుతోంది. ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్‌లో జర్నీ చేస్తున్న రైనా.. స్పెషల్ క్యాప్ పెట్టుకుని, మొబైల్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే, ఇందులో రైనా ఫేస్ ఏమాత్రం కనిపించడం లేదు. ఇందుకు సంబంధించిన ఫోటోను రైనా తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ పోస్టుకు మిస్ యు, లవ్ యూ, తమ అభిమానాన్ని చాటుతున్నారు. బెస్ట్ క్రికెటర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సురేష్ రైనా షేర్ చేసిన ఈ ఫోటోను చూడండి..

View this post on Instagram

A post shared by Suresh Raina (@sureshraina3)

మరిన్ని క్రికెట్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..