Banana: చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినొచ్చా? తినకూడదా? దీనిని ఎవరు తినొద్దు?

చలికాలంలో అరటిపండును రాత్రిపూట తినాలా వద్దా అని చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. ఎందుకంటే అరటిపండులో ఉష్ణోగ్రతను తగ్గించే లక్షణాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అందుకే అరటి పండును చలికాలంలో..

Banana: చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినొచ్చా? తినకూడదా? దీనిని ఎవరు తినొద్దు?
శరీరంలో యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరగడం మొదలవుతుంది. అదే సమయంలో, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, అది కిడ్నీపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow us

|

Updated on: Dec 15, 2022 | 10:01 PM

చలికాలంలో అరటిపండును రాత్రిపూట తినాలా వద్దా అని చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. ఎందుకంటే అరటిపండులో ఉష్ణోగ్రతను తగ్గించే లక్షణాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అందుకే అరటి పండును చలికాలంలో తినేందుకు వెనుకాడుతారు. ఇక అరటిపండును మధ్యాహ్నం పూట మాత్రమే తినాలని చెబుతుంటారు. వాస్తవంగా చూసుకుంటే.. అరటి పండు ఆరోగ్యకరమైన పండు. ఇందులో కాల్షియం, ఐరన్ సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న ఈ పండును నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అందరూ అనుమానిస్తున్నట్లు చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినాలా? వద్దా? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినాలా వద్దా?

రాత్రిపూట అరటిపండు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే మాత్రం తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. నిద్రపోయే ముందు అరటిపండు తింటే శ్లేష్మం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతే కాదు, అరటిపండ్లు జీర్ణం కావడానికి కూడా సమయం పడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను పెంచుతుంది. ఈ కారణంగా అరటిపండును రాత్రి సమయంలో కంటే.. పగటిపూట తినడమే ఉత్తమం.

చలికాలంలో పిల్లలకు అరటిపండ్లు తినిపించొచ్చా?

పిల్లలకు చలికాలంలో అరటిపండ్లను తినిపించొచ్చా? లేదా? అని తల్లిదండ్రుల నుంచి తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. అరటిపండులో దాదాపు 100 కేలరీల శక్తి ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అందుకే ప్రతి సీజన్‌లో పిల్లలకు అరటిపండ్లు తినిపించాలని అంటారు. అయితే, ఎండాకాలమైనా? చలికాలమైనా? పిల్లలకు కఫం ఉంటే మాత్రం రాత్రిపూట అరటిపండును తినిపించకూడదు.

ఇవి కూడా చదవండి

వీరు అరటిపండు తినకూడదు..

దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అరటి పళ్ళు తినకూడదు. ఇది కాకుండా, మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు కూడా అరటిపండును తినొద్దు. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు అరటిపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?