AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday: దేశం కంటే ఆయనకు ఏదీ ఎక్కువ కాదు.. ప్రధాని మోదీపై నిర్మలా సీతారామన్ ప్రశంసలు..

PM Modi Birthday: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని సేవతో జరుపుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ అన్నారు.

PM Modi Birthday: దేశం కంటే ఆయనకు ఏదీ ఎక్కువ కాదు.. ప్రధాని మోదీపై నిర్మలా సీతారామన్ ప్రశంసలు..
Nirmala Sitharaman
Shiva Prajapati
|

Updated on: Sep 17, 2022 | 11:58 AM

Share

PM Modi Birthday: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని సేవతో జరుపుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ అన్నారు. శనివారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రతి బీజేపీ కార్యకర్త రక్తదానం చేయడమో, టీబీ రోగిని దత్తత తీసుకోబడమో చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి ఒక్కరి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రతి పేదవాడిని జన్ ధన్ ఖాతాలతో బ్యాంకుల దగ్గరకు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకే నేరుగా అందేలా డీబీటీ అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో కేంద్రం రూ. 100 ఇస్తే.. రూ. 15 మాత్రమే లబ్దిదారుడికి చేరేదని, కానీ, ఇప్పుడు కేంద్రం ఎంత ఇస్తే అంత మొత్తం నేరుగా పేదవాడి ఖాతాకు చేరుతోందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ అన్నది లేకుండా అమలవుతున్నాయని చెప్పారు. ముద్ర స్కీం ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిరువ్యాపారులకు రుణాలు అందుతున్నాయని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి.

తాను పెరిగిన నర్సాపురంలో తన చిన్నతనంలో కూరగాయల వ్యాపారులు ఎన్ని కష్టాలు పడేవారో చూశానని, డైలీ ఫైనాన్స్ వ్యవస్థ నుంచి రూ. 100 రుణంగా తీసుకుంటే రూ. 90 మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. మళ్లీ సాయంత్రం వ్యాపారం ముగించుకుని తిరిగి చెల్లించేటప్పుడు రూ. 100 చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఈ తరహాలో రోజువారీ దోపిడీకి చిరు వ్యాపారులు గురయ్యేవారన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి వచ్చిందని, ప్రతీ కుటుంబానికి సొంతిల్లు అందించాలన్నది ప్రధాని మోదీ తాపత్రయం అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేంద్రం ఇళ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. నేషన్ ఫస్ట్ అన్న విధానంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. దేశం కంటే ఆయనుకు ఏదీ ఎక్కువ కాదని, అలాంటి వ్యక్తి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..