Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ సీఎం మమతా ముఖర్జీ ఎన్నిక కోసం..ఢిల్లీలో ఈసీతో భేటీ కానున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిబృందం

బెంగాల్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ తో భేటీ కానుంది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు..

బెంగాల్ సీఎం మమతా ముఖర్జీ ఎన్నిక కోసం..ఢిల్లీలో ఈసీతో భేటీ కానున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిబృందం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 15, 2021 | 9:50 AM

బెంగాల్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ తో భేటీ కానుంది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆమెకు ఈ ఉప ఎన్నికలు ఎంతో కీలకం.. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మినిస్టీరియల్ పదవిని పొందాలంటే ఆరు నెలల్లోగా రాష్ట్ర అసెంబ్లీ లేదా పార్లమెంటుకు ఎన్నికై ఉండాలి. మమత ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే నవంబరు 4 లోగా ఎన్నిక కావలసి ఉంటుంది. లేదా ఆమె ఈ పదవిని కోల్పోతారు. అందువల్లే ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని తాము ఈసీని కోరనున్నామని టీఎంసీ ఎంపీలుతెలిపారు. .

సీనియర్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ నేతృత్వంలో ఈ బృందం ఎన్నికల సంఘంతో భేటీ కానుంది. ఈసీ కావాలనే ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నిర్వహణపై జాప్యం చేస్తోందని రాజ్యసభలో ఈ పార్టీ చీఫ్ విప్ సుఖేందు శేఖర్ రే ఆరోపించారు. దేశంలో థర్డ్ కోవిడ్ వేవ్ వచ్చేంతరవరకు వెయిట్ చేద్దామనుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గాయని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఈ ఎన్నికలను నిర్వహించాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. భవానీపూర్, దిన్ హట, శాంతిపూర్, ఖర్దా, గోసబ, షంషేర్ గంజ్, జంగిపూర్ నియోజకవర్గాలకు బైపోల్స్ జరగాల్సి ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల అభ్యర్థులు మరణించడమో, ఈ స్థానాలకు రాజీనామా చేయడమో జరిగింది. భవానీపూర్ నుంచి మమత పోటీ చేసేందుకు వీలుగా అక్కడ అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగాడు.

మరిన్ని ఇక్కడ చూడండి : స్కూల్ కు వెళ్లిన చిరుతపులి..అధికారులకు 4 గంటల రెస్క్యూ.. వైరల్ అవుతున్న వీడియో..:Leopard In School Video.

 Sonu Sood Video: సోనూసూద్‌ ను కొట్టారు అందుకే టీవీ ప‌గ‌ల‌గొట్టిన అంటున్న బుడ్డోడు.రీజన్ మాములుగా లేదు.

 Nivetha Pethuraj Video: ఎఫ్1 రేసర్‌గా నివేతా పేతురాజ్‌..ఫార్ములా రేస్ కార్‌లో లెవెల్‌లో 1 సర్టిఫికెట్..(వీడియో).

 గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..అందుబాటులోకి కొత్త సర్వీసులు..!Good News For LPG Customer video.

ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్
పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌
పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌
ఈ లక్షణాలున్న వ్యక్తితో పరిచయం మీ పతనానికి దారి.. అవి ఏమిటంటే
ఈ లక్షణాలున్న వ్యక్తితో పరిచయం మీ పతనానికి దారి.. అవి ఏమిటంటే
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌..
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌..