లిప్స్టిక్ పెట్టుకునే ఆడవాళ్లు హంగామా చేస్తారు.. ఆర్జేడీ నేత వివాదస్పద వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ బిల్లు అంశంపై ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ ప్రస్తావించారు. అలాగే దీనిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్స్టిక్లు బాబ్ కట్ చేసుకున్న మహిళలలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకు వస్తారని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ బిల్లు అంశంపై ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ ప్రస్తావించారు. అలాగే దీనిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్స్టిక్లు బాబ్ కట్ చేసుకున్న మహిళలలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకు వస్తారని పేర్కొన్నారు. అయితే ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని నేతలు సైతం విభేదించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని ముజాఫర్పూర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సిద్దిఖీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది కావున ఇకనుంచి లిప్స్టిక్లు పెట్టుకునే ఆడవాళ్లు బాబ్ కట్ చేసుకునే ఆడవాళ్లు మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి హంగామా చేయడం ప్రారంభిస్తారు చూడండంటూ మాట్లాడారు.
ఈ తర్వాత ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అయితే గ్రామస్తులకు అర్ధమయ్యే విధంగా చెప్పడం కోసం తాను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని అబ్దుల్ బారీ సిద్దిఖీ అన్నారు. ముందునుంచి కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగినటువంటి ప్రత్యేక సమావేశాల్లో కూడా ఆర్జేడీ పార్టీ బిల్లుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ మహళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలను చేర్చకపోవడంపై మాత్రం తమ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిందని అన్నారు. ఇదిలా ఉండగా అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌశల్ కిషోర్ స్పందించారు. అయితే దీన్ని బట్టి ఆయన ఆలోచనలు ఎంత కింది స్థాయిలో ఉన్నాయో తమకు స్పష్టంగా అర్థమవుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే మహిళలు చట్టాలను, రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించడానికి వస్తున్నారని అన్నారు. ఒక కారుకు చక్రాలు ఉన్నట్లుగానే పార్లమెంటులో కూడా పురుషులు మహిళలు చట్టాలు చేసే విషయంలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. అయితే ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా ఇలా మాట్లాడతారని ప్రశ్నల వర్షం గుప్పించారు. మరోవైపు సిద్దిఖీ చేసినటువంటి వ్యాఖ్యలను ఇండియా కూటమిలో ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నేతలు ఖండించారు. అయితే ఆ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ.. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. అలాగే ఓబీసీలతో సహా ఎస్సీ,ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారు సైతం రిజర్వేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.




