AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP orders: దళిత కవి రాసిన కవిత, పాఠ్యాంశం నుండి తొలగించాలంటూ సర్కార్ ఆదేశాలు..

పాఠ్యపుస్తకాలలో సిలబస్ మార్చే కార్యక్రమం శరవేగంగా పూర్తి చేస్తోంది కర్నాటక ప్రభుత్వం. ఓ వైపు ప్రతి పక్షాలు ఈ వ్యవహారాన్ని విమర్షిస్తుండగానే బీజేపీ సర్కారు మాత్రం తన ప్రణాళికను అంతేజోరుగా ముందుకు కొనసాగిస్తోంది. తాజాగా

BJP orders: దళిత కవి రాసిన కవిత, పాఠ్యాంశం నుండి తొలగించాలంటూ సర్కార్ ఆదేశాలు..
Poem
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2022 | 12:41 PM

Share

పాఠ్యపుస్తకాలలో సిలబస్ మార్చే కార్యక్రమం శరవేగంగా పూర్తి చేస్తోంది కర్నాటక ప్రభుత్వం. ఓ వైపు ప్రతి పక్షాలు ఈ వ్యవహారాన్ని విమర్షిస్తుండగానే బీజేపీ సర్కారు మాత్రం తన ప్రణాళికను అంతేజోరుగా ముందుకు కొనసాగిస్తోంది. తాజాగా కర్ణాటక విద్యాశాఖ మంత్రి తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది. 4వ తరగతి పాఠ్యపుస్తకం నుండి దివంగత దళిత కవి సిద్దలింగయ్య రచించిన ‘భూమి’ అనే కవితను తొలగించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

దివంగత దళిత కవి సిద్దలింగయ్య రచించిన ఆ కవిత లో సూర్య, చంద్రులు దేవుళ్ళు కాదని, భగవంతుణ్ణి, ఆత్మను ఎవరూ చూడలేదని చెప్పుకొచ్చారు. శాస్త్రాలు, పురాణాలు అబద్ధాల మూటలేనని కవి సిద్దరామయ్య రచించారు. చాలా ఏళ్ళుగా ఆ కవిత 4వ తరగతి పాఠ్యాంశాల్లో బోధిస్తున్నారు. అయితే హిందుత్వ భావాలకు వ్యతిరేకంగా ఉన్న పాఠ్యాంశాలన్నింటినీ తొలగించాలని నిర్ణయం తీసుకున్న కర్ణాటక బీజేపీ సర్కారు ‘భూమి’ కవితను కూడా తొలగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కవిత వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ పద్యం కాంగ్రెస్ హయాంలో పరిచయం చేయబడింది. అప్పటి బరగూరు రామచంద్రప్ప నేతృత్వంలోని పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ ఈ కవితను సిలబస్‌లో పొందుపరిచింది. కాగా, ఈ కవితపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకంలోని అంశం వివాదాస్పదంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రోహిత్‌ చక్రవర్తి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచించిన మార్పులను అనుసరించి ఎట్టకేలకు ఈ కవితను సిలబస్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం వెలువడింది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..