Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor New Prices: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు, ట్విస్ట్‌ ఎంటంటే..!

దేశంలో మద్యం సేవించేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వాల ఖజానాలకు భారీగా ఆదాయం వస్తోంది. దీంతో మరింత ఆదాయం కోసం ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. మద్యం ధరలను

Liquor New Prices: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు, ట్విస్ట్‌ ఎంటంటే..!
Liquor
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 13, 2022 | 10:50 AM

దేశంలో మద్యం సేవించేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వాల ఖజానాలకు భారీగా ఆదాయం వస్తోంది. దీంతో మరింత ఆదాయం కోసం ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. మద్యం ధరలను పెంచుతూ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే మద్యం ధరలను తగ్గిస్తూ మందుబాబులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ, పంజాబ్‌ ప్రభుత్వం మాత్రం భిన్నమైన పాలసీని కొనసాగిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..వేసవి కాలం కావడంతో ఎండ వేడిని తట్టుకునేందుకు చల్లని బీర్లు, మందు తాగుతూ మందుబాబులు చిల్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది.2022-23 సంవత్సరానికి సంబంధించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మద్యం పాలసీని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. మద్యం ధరలను గణనీయంగా తగ్గించనుంది. సరికొత్త ఎక్సైజ్ విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా మద్యం ప్రియులతో ఫరీద్ కోట్ ఆప్ ఎమ్మెల్యే గుర్దిత్ సింగ్ మాట్లాడుతూ… వీలైతే మద్యం మానేసేందుకు ప్రయత్నించాలని కోరారు. మందు మానలేని పరిస్థితిలో ఉంటే… తక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడం వల్ల మిగిలే డబ్బును ఇంటి అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని చెప్పారు. అయితే, ఈ కొత్త పాలసీ వల్ల అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్నీ జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..