AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu Rain: తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షపాతం.. నీట మునిగిన సీఎం ప్రాతినిధ్యం ప్రాంతం.. స్టాలిన్ అత్యవసర సమావేశం

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేట, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిదంబరం లో యూనివర్సిటీ లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సీఎం స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొరట్టూరు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది.

Tamilnadu Rain: తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షపాతం.. నీట మునిగిన సీఎం ప్రాతినిధ్యం ప్రాంతం.. స్టాలిన్ అత్యవసర సమావేశం
Tamilnadu Rains
Surya Kala
|

Updated on: Nov 03, 2022 | 2:04 PM

Share

తమిళనాడులో మూడు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చెన్నై, చెంగలపట్టు, కాంచీపురం ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధాని చెన్నై సహా సమీప ప్రాంతాలు రెడ్ హిల్స్, పొన్నెరీ, గుమ్మిడిపూడి ప్రాంతాలు జలమయం అయ్యాయి.  కాంచీపురం లో 21 సెంటి మీటర్లు , చెన్నై అవడి 18 సెంటమీటర్లు వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర చెన్నైలోని రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు నగర దక్షిణ ప్రాంతాలు, శివారు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడింది. తేని పుడుక్కోటై, తిరువారూరు, నాగపట్నం, కడలూరు , మైలాడు దురై జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎమెర్జెన్సీ విధించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. వరద ప్రభావ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేట, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిదంబరం లో యూనివర్సిటీ లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సీఎం స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొరట్టూరు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం స్టాలిన్  అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వరద సహాయకోసం తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు.

పూండి, చెంబరంబాక్కం డ్యామ్‌ల నుంచి నీటి విడుదల: 

ఇవి కూడా చదవండి

రిజర్వాయర్లలోకి వచ్చే ఇన్ ఫ్లోలను బట్టి విడుదల చేయాల్సిన నీటి పరిమాణాన్ని పెంచుతామని తిరువళ్లూరు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఒడ్డున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్టోబరు 29న ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాల కారణంగా 11,757 ఎంసీఎఫ్‌టీల సామర్థ్యంతో పూండి, చోళవరం, రెడ్‌హిల్స్, కన్నంకోట్టై థెర్వోయ్‌కండిగై, చెంబరంబాక్కం డ్యామ్‌లలో నీటి మట్టం వేగంగా నిండుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..