Sidhu Resign: సిద్ధూ రాజీనామా ఆమోదించే దిశలో కాంగ్రెస్ అధిష్టానం.. ఢిల్లీ వెళ్ళిన పంజాబ్ సీఎం చరంజిత్ చన్నీ!

KVD Varma

KVD Varma |

Updated on: Oct 05, 2021 | 9:06 PM

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తప్పుకోవచ్చు. ఆయన ఒక వారం క్రితం రాజీనామా చేశారు. దీనిని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించవచ్చు. దీని కోసం, సీఎం చరంజిత్ చన్నీని ఢిల్లీకి పిలిచారు.

Sidhu Resign: సిద్ధూ రాజీనామా ఆమోదించే దిశలో కాంగ్రెస్ అధిష్టానం.. ఢిల్లీ వెళ్ళిన పంజాబ్ సీఎం చరంజిత్ చన్నీ!
Sidhu

Follow us on

Sidhu Resign: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తప్పుకోవచ్చు. ఆయన ఒక వారం క్రితం రాజీనామా చేశారు. దీనిని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించవచ్చు. దీని కోసం, సీఎం చరంజిత్ చన్నీని ఢిల్లీకి పిలిచారు. ఆయనతో పాటు ఎంపీలు రవనీత్ బిట్టు, కుల్జీత్ నగ్రాను కూడా పిలిచారు. సిద్ధూ రాజీనామాను ఆమోదించిన తర్వాత, బిట్టు లేదా నాగ్రాను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయవచ్చు. కాంగ్రెస్ వర్గాల ప్రకారం, సిద్ధు మొండి వైఖరితో కోపంతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయంతీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ముగ్గురు సోనియా గాంధీని కలవవచ్చు. సోనియాతో ఈ ముగ్గురి సమావేశం తర్వాత మాత్రమే అధికారిక నిర్ధారణ జరుగుతుంది.

డీజీపీ అలాగే ఏజీని తొలగించాలనే డిమాండ్‌పై సిద్ధూ మొండిగా ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి చన్నీ దానికి అంగీకరించలేదు. యుపిఎస్‌సి నుండి ముగ్గురు అధికారుల ప్యానెల్ వచ్చిన తర్వాత తాను నిర్ణయిస్తానని సిఎం చన్నీ చెప్పారు. అదే సమయంలో, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సాక్రైలేజ్ కేసు అడ్వొకేట్ జనరల్ నుండి తీసుకుని.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అప్పగించారు. అయినప్పటికీ, సిద్ధు అసంతృప్తి అక్కడితో ఆగలేదు. సిద్ధూ కాంగ్రెస్ పార్టీ నుంచి.. ప్రభుత్వం నుండి వేరుగా నడుస్తున్నారు.

అమరీందర్‌ను తొలగించిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్, సిద్ధు పట్టుబట్టడంతో..సునీల్ జాఖర్‌ను తొలగించి, సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా చేసింది. ఆయన పట్టుబట్టడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎం కుర్చీ నుంచి తొలగించారు. దీని తరువాత, అతను కొత్త CM చన్నీపై కోపగించి ఇంట్లో కూర్చున్నాడు. దీని గురించి హైకమాండ్ కూడా కోపంగా ఉందని నమ్ముతారు. దీంతో సిద్ధూ రాజీనామాను ఆమోదించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి వస్తోంది.

నగ్రాకు మంత్రి పదవి లభించలేదు.. బిట్టు బియాంత్ సింగ్ మనవడు..

కుల్జిత్ నాగ్రాను చాన్నీ క్యాబినెట్‌లో చేర్చాలని నిర్ణయించారు. చివరి క్షణంలో అతని పేరు తొలగించారు. నాగ్రా ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ హెడ్. సిద్ధుని తొలగించిన తర్వాత, నగ్రాను అధిపతిగా చేసే అవకాశం ఉంది. అదే సమయంలో, లూథియానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రవనీత్ బిట్టు కూడా పంజాబ్ రాజకీయాల్లో పెద్ద పేరు. అతను పంజాబ్‌లో తీవ్రవాద యుగంలో అమరుడైన మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు.

పర్యటనలో ఆకస్మిక మార్పు..

ముఖ్యమంత్రి చన్నీ మంగళవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాల్సి ఉంది. ఇందుకోసం ఆయన మొహాలీ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. దీని తరువాత అకస్మాత్తుగా ఆయన మొహాలీలో అడుగుపెట్టాడు. అక్కడ ఎంపీ రవనీత్ బిట్టు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జిత్ నాగ్రా ఆయనతో పాటు హెలికాప్టర్‌లో ఢిల్లీకి బయలుదేరారు. బిట్టు.. నగ్రాను కూడా వెంట తీసుకురావాలని సిఎంకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సందేశం వచ్చిందని పంజాబ్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

సిద్ధూ రెండున్నర నెలల తర్వాత కూడా..

నవజ్యోత్ సిద్ధూ జూలై 22 న పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీని తరువాత, దాదాపు రెండున్నర నెలల కాలం గడిచిన తర్వాత కూడా, ఆయన స్థానిక సంస్థలను ఏర్పాటు చేయలేకపోయారు. అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి యూనిట్లు జనవరి 2020 నుండి పంజాబ్‌లో రద్దు అయ్యాయి. అటువంటి పరిస్థితిలో, సిద్ధూ కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి బదులుగా ప్రభుత్వ విషయాలపై శ్రద్ధ చూపిస్తున్నారు. పంజాబ్‌లో 3 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, స్థానికంగా కాంగ్రెస్ కు నాయకుల అండ లేకుండా, కాంగ్రెస్ కష్టం పెరుగుతుంది. ఇదే విషయం హైకమాండ్‌ని కూడా కలవరపెడుతోంది. ఇది కాకుండా, వచ్చే ఎన్నికల్లో తనను సిఎమ్‌గా ప్రకటించాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Shut Down Mystery: ఏడు గంటల షట్‌డౌన్‌.. ఎవరున్నారు.. ఏం చేశారు.. అదే నిజమా.. వివాదం వెనుక రహస్యం..

Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరు నోబెల్ బహుమతి.. అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లకు పురస్కారం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu