Presidential Election 2022: ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ప్రకటన..

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ఇస్తుందని.. దీని కోసం శివసేన ఎంపీలు లేదా మరెవరూ తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఉద్ధవ్ స్పష్టంచేశారు..

Presidential Election 2022: ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ప్రకటన..
Uddhav Thackeray
Follow us

|

Updated on: Jul 12, 2022 | 6:13 PM

Uddhav Thackeray: శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential election) మద్దతు అంశంపై కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపది ముర్మూకే మద్దతు ఇస్తున్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ముంబై దాదర్‌లోని శివసేన భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ఇస్తుందని.. దీని కోసం శివసేన ఎంపీలు లేదా మరెవరూ తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఉద్ధవ్ స్పష్టంచేశారు. కాగా.. ఉద్ధవ్ ఠాక్రే.. తన నివాసం మాతోశ్రీలో సోమవారం పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. హాజరైన 15 మంది ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది మర్ముకు మద్దతు ఇవ్వాలని వారంతా అభిప్రాయపడినట్టు ఆ పార్టీ ఎంపీ గజానన్‌ కిరీట్కర్‌ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర జనాభాలో దాదాపు 10శాతం మంది ఆదివాసీలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. కొంతకాలంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. బీజేపీపై కోపంగా ఉన్నారు. ఇటీవల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. శివసేన నేత ఏక్‌నాథ్‌ శిండే తిరుగుబాటు చేయడం.. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికే శివసేన మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ద్రౌపదీ ముర్మూ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..