AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దెబ్బ తిన్న పర్యావరణం…..మొక్కలు ఎన్ని నాటారో చెప్పాలన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పర్యావరణం తీవ్రంగా దెబ్బ తిన్నదని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన..

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దెబ్బ తిన్న పర్యావరణం.....మొక్కలు ఎన్ని నాటారో చెప్పాలన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్
Samaj Wadi Party Leader Akhilesh Yadav Slams Up Govt.. On Plantation Drive
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 05, 2021 | 9:41 PM

Share

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పర్యావరణం తీవ్రంగా దెబ్బ తిన్నదని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రాష్ట్రంలో చెట్లు కేవలం ప్రభుత్వ ఫైళ్లలో మాత్రమే ‘పెరుగుతున్నాయని’ ఎద్దేవా చేశారు. పర్యావరణ పరిరక్షణపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రతి ఏడాదీ ట్రీ ప్లాంటేషన్ పేరిట తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎన్విరాన్ మెంట్ దెబ్బ తిన్నదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తన నాయకత్వం కింద ముఖ్యంగా బుందేల్ ఖండ్ ప్రాంతంలో గ్రీన్ పార్కులు ఎలా ఏర్పాటు చేశామో అందరికీ తెలిసిందేనన్నారు. ఆ సందర్భంగా గిన్నెస్ బుక్ రికార్డులకు కూడా ఎక్కామని అఖిలేష్ యాదవ్ గుర్తు చేశారు. కాగా జులై మొదటివారం నుంచి ప్రారంభించి ఈ సంవత్సరం 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు గాను ఈ నెల 15 కల్లా ల్యాండ్ ను గుర్తించాలని తాము అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లను ఆదేశించినట్టు ఆయన చెప్పారు.

వచ్చే నెల మొదటివారం నుంచి అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులకు మొక్కలు పంపిణీ చేయాలని వారిని కోరినట్టు ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఇండియా క్లైమేట్ జస్టిస్ గా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దేశంలో 2025 నాటికి ఈథనాల్ బ్లెండింగ్ పై నిపుణుల కమిటీ రూపొందించిన రోడ్ మ్యాప్ నివేదికను ఆయన శనివారం రిలీజ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: యాదాద్రిపై కరోనా ప్రభావం నారసింహ బయట పడేది ఎలా..?:Corona Effect on Yadadri Temple live video.

హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

వర్క్ ఫ్రొమ్ హోమ్ చేస్తాం..! లేదా వి క్విట్ అంటున్న ఉద్యోగులు..వర్క్ ఫ్రొమ్ హోమ్ కె ప్రాధాన్యత ఇస్తున్న ఉద్యోగులు..:Work From Home.

బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ