2000 Rupees Notes: అక్కడ పెట్రోల్/డీజిల్ కొన్నా రూ.2 వేల నోట్లే ఇస్తున్నారు
రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరింస్తూ ఇటీవల ఆర్బీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ నోట్లతో చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. రూ.2వేల నోట్లతో ఇంధనం కొనుగోళ్లు దాదాపు 5 రెట్లు పెరిగినట్లు మధ్యప్రదేశ్లోని ఇందౌర్ జిల్లా పెట్రోల్ బంకుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ వాసు తెలిపారు.
రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరింస్తూ ఇటీవల ఆర్బీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ నోట్లతో చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. రూ.2వేల నోట్లతో ఇంధనం కొనుగోళ్లు దాదాపు 5 రెట్లు పెరిగినట్లు మధ్యప్రదేశ్లోని ఇందౌర్ జిల్లా పెట్రోల్ బంకుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ వాసు తెలిపారు. కొందరు కస్టమర్లు తమ వాహనాలకు రూ.100ల పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసినా రూ.2వేల నోటుతోనే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే ఆర్బీఐ అనూహ్య నిర్ణయం వల్ల రూ.2వేల నోట్లతో ఇంధన కొనుగోలుకు చెల్లింపులు పెరిగినప్పటికీ.. ఈ నోట్లను బ్యాంకుల్లో సులభంగా మార్చుకునే అవకాశం ఉండటంతో తమకు ఇదేమీ పెద్ద ఇబ్బందిగా లేదని చెబుతున్నారు. ఇటీవల చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ చెల్లింపులు చేస్తుండటంతో పెట్రోల్ బంకుల వద్ద తక్కువ డినామినేషన్ కరెన్సీ నోట్ల లభ్యత పెద్ద సమస్యగా లేదన్నారు. ఇదిలా ఉండగా దేశంలో 2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకొంటున్నట్టు శుక్రవారం ఆర్బీఐ అనూహ్య ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ నోట్లు కలిగి ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి నోట్లను మార్చుకొనేందుకు అవకాశం కల్పించింది. అలాగే రూ.50వేలు కన్నా ఎక్కువ మొత్తంలో రూ.2వేల నోట్లను డిపాజిట్ చేసేవాళ్లు పాన్ కార్డు సమర్పించాలని తాజగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు .
మరిన్ని జాతీయ వార్తల కోసం