Watch Video:ఈశాన్య రాష్ట్రాలకు కొత్త రైలు.. లోపల మాములుగా లేదుగా
దేశంలో వివిధ ప్రాంతాలను కలిపేలా భారత రైల్వే శాఖ కొత్త రూట్లలో కొన్ని రైళ్లను ప్రారంభించింది.
దేశంలో వివిధ ప్రాంతాలను కలిపేలా భారత రైల్వే శాఖ కొత్త రూట్లలో కొన్ని రైళ్లను ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాలను చూసేందుకు ఇటీవలే భారత్ గౌరవ్ డెలుక్స్ అనే టూరిస్టు ట్రైన్ ను ప్రవేశపెట్టింది. ఈ రైలు లోపల ఎలా ఉంటుందో అని ప్రయాణికులు తెలిసేవిధంగా రైల్వే శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ప్రయాణికులకు కావల్సిన చిన్న లైబ్రరీ, డైనింగ్ రెస్టారెంట్ లు కూడా ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ వసతులన్ని ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ట్రైన్ 15 రోజుల పాటు టూర్ వేయనుంది. మార్చి 21న ఈ టూర్ ఢిల్లీలోని సఫ్ దర్జంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో అస్సాం, త్రిపురా, నాగలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను చూపించనున్నారు. దాదాపు 156 టూరిస్టులు ప్రస్తుతం ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
‘नॉर्थ-ईस्ट डिस्कवरी’ #BharatGaurav डीलक्स एसी टूरिस्ट ट्रेन मिनी लाइब्रेरी, फाइन डाइनिंग रेस्तरां जैसी अत्याधुनिक यात्री सुविधाओं से सुसज्जित है, जो यात्रियों को एक यादगार सफर का अनुभव कराएगी।#NorthEastDiscovery@AshwiniVaishnaw @MinOfCultureGoI @tourismgoi @MDoNER_India pic.twitter.com/JJi7omrfJw
ఇవి కూడా చదవండి— Ministry of Railways (@RailMinIndia) March 21, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..