Punjab: ఇక జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు.. దేశంలోనే తొలిసారిగా..
జైళ్లు జీవితం అంటే ఎవరికైనా జీవితంలో అదో చేదు జ్ఞాపకమే. కొంతమంది కరడుగట్టిన నేరస్తులకు మాత్రం అది ఇష్టమైన ఇళ్లు. కాని చాలామంది ఏ నేరం చేయకుండానే పరిస్థితుల కారణంగా జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఖైదీల్లో పరివర్తన కోసం ప్రభుత్వాలు వివిధ..
Punjab: జైళ్లు జీవితం అంటే ఎవరికైనా జీవితంలో అదో చేదు జ్ఞాపకమే. కొంతమంది కరడుగట్టిన నేరస్తులకు మాత్రం అది ఇష్టమైన ఇళ్లు. కాని చాలామంది ఏ నేరం చేయకుండానే పరిస్థితుల కారణంగా జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఖైదీల్లో పరివర్తన కోసం ప్రభుత్వాలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు. ఏంటి జైళ్లో జీవితభాగస్వామితో గడపడం ఏంటుంటున్నారా.. అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. అవెంటో.. అసలు ఈనిర్ణయానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఎంతోకాలంగా జైలు జీవితం గడుపుతోన్న ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు పంజాబ్ జైళ్ల శాఖ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. జైళ్లో ఉన్న తమను చూసేందుకు వచ్చే భాగస్వామితో కొన్ని గంటలపాటు ఏకాంతంగా గడిపేందుకు (Conjugal Visits) వీలు కలిపించింది. ప్రతి మూడునెలలకు ఒకసారి ఖైదీలకు ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయంతో జైళ్లలో ఇటువంటి విధానం అమలు చేయడం దేశంలోని తొలిసారి కానుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే తమ భాగస్వామితో గడిపేందుకు వీలు కల్పించనున్నారు. దీనికోసం జైళ్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. రెండు గంటలపాటు వీరిని ఏకాంతంగా ఉండనిస్తారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్స్టర్లు, అధిక ముప్పు ఉన్న ఖైదీలు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి మాత్రం ఈ సదుపాయాన్ని కల్పించరు. తొలుత ఈ విధానాన్ని (Conjugal Visits) గోయింద్వాల్ సాహిబ్లో ఉన్న కేంద్ర కరాగారం, నభాలోని నూతన జిల్లా జైలుతోపాటు భఠిండాలోని మహిళా జైళ్లలో అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర జైళ్లశాఖ వెల్లడించింది.
ఈ విధానం వల్ల వైవాహిక బంధాన్ని బలోపేతం చేయడంతోపాటు ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నమని పేర్కొంది. ఇలా తమ భాగస్వామితో ఏకాంతంగా గడపాలి అనుకునేవారు పెళ్లి ధ్రువపత్రంతోపాటు ఖైదీని చూడడానికి వచ్చే ముందు కొవిడ్, లైంగిక సంబంధ, ఇతర అంటువ్యాధులు లేవని వైద్యుడి నుంచి ధ్రవీకరణ పత్రం తీసుకుని రావల్సి ఉంటుందని జైళ్ల శాఖ ప్రకటించింది. మొత్తంమీద పంజాబ్ ప్రభుత్వం ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈనిర్ణయం ఎటువంటి ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..