Punjab: ఇక జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు.. దేశంలోనే తొలిసారిగా..

జైళ్లు జీవితం అంటే ఎవరికైనా జీవితంలో అదో చేదు జ్ఞాపకమే. కొంతమంది కరడుగట్టిన నేరస్తులకు మాత్రం అది ఇష్టమైన ఇళ్లు. కాని చాలామంది ఏ నేరం చేయకుండానే పరిస్థితుల కారణంగా జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఖైదీల్లో పరివర్తన కోసం ప్రభుత్వాలు వివిధ..

Punjab: ఇక జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు.. దేశంలోనే తొలిసారిగా..
Prisons
Follow us

|

Updated on: Sep 21, 2022 | 12:41 PM

Punjab: జైళ్లు జీవితం అంటే ఎవరికైనా జీవితంలో అదో చేదు జ్ఞాపకమే. కొంతమంది కరడుగట్టిన నేరస్తులకు మాత్రం అది ఇష్టమైన ఇళ్లు. కాని చాలామంది ఏ నేరం చేయకుండానే పరిస్థితుల కారణంగా జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఖైదీల్లో పరివర్తన కోసం ప్రభుత్వాలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు. ఏంటి జైళ్లో జీవితభాగస్వామితో గడపడం ఏంటుంటున్నారా.. అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. అవెంటో.. అసలు ఈనిర్ణయానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఎంతోకాలంగా జైలు జీవితం గడుపుతోన్న ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు పంజాబ్‌ జైళ్ల శాఖ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. జైళ్లో ఉన్న తమను చూసేందుకు వచ్చే భాగస్వామితో కొన్ని గంటలపాటు ఏకాంతంగా గడిపేందుకు (Conjugal Visits) వీలు కలిపించింది. ప్రతి మూడునెలలకు ఒకసారి ఖైదీలకు ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయంతో జైళ్లలో ఇటువంటి విధానం అమలు చేయడం దేశంలోని తొలిసారి కానుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే తమ భాగస్వామితో గడిపేందుకు వీలు కల్పించనున్నారు. దీనికోసం జైళ్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. రెండు గంటలపాటు వీరిని ఏకాంతంగా ఉండనిస్తారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లు, అధిక ముప్పు ఉన్న ఖైదీలు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి మాత్రం ఈ సదుపాయాన్ని కల్పించరు. తొలుత ఈ విధానాన్ని (Conjugal Visits) గోయింద్వాల్‌ సాహిబ్‌లో ఉన్న కేంద్ర కరాగారం, నభాలోని నూతన జిల్లా జైలుతోపాటు భఠిండాలోని మహిళా జైళ్లలో అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర జైళ్లశాఖ వెల్లడించింది.

ఈ విధానం వల్ల వైవాహిక బంధాన్ని బలోపేతం చేయడంతోపాటు ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నమని పేర్కొంది. ఇలా తమ భాగస్వామితో ఏకాంతంగా గడపాలి అనుకునేవారు పెళ్లి ధ్రువపత్రంతోపాటు ఖైదీని చూడడానికి వచ్చే ముందు కొవిడ్, లైంగిక సంబంధ, ఇతర అంటువ్యాధులు లేవని వైద్యుడి నుంచి ధ్రవీకరణ పత్రం తీసుకుని రావల్సి ఉంటుందని జైళ్ల శాఖ ప్రకటించింది. మొత్తంమీద పంజాబ్ ప్రభుత్వం ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈనిర్ణయం ఎటువంటి ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు