Delhi: ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం.. శాఖల కేటాయింపుపై స్పష్టత అప్పుడే..

సంకీర్ణ ధర్మం పాటిస్తూ, మోదీ జంబో కేబినెట్‌ కూర్పు పూర్తయింది. ఇక యాక్షన్‌లోకి దిగే టైమొచ్చింది. అంతకంటే ముందు ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయి అన్నది ఆసక్తిగా మారింది. దీనికి సంబందించిన కొంత సమాచారం పార్టీ నేతల నుంచి వెలువడుతోంది. జూన్ 10 సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం జరగనుంది. మోదీ నేతృత్వంలో సమావేశానికి ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు హాజరుకానున్నారు. మధ్యాహ్నంకల్లా పోర్టుఫోలియోలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు వెల్లడైతే ఎవరికి ఏశాఖ కేటాయించారో స్పష్టం వస్తుంది.

Delhi: ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం.. శాఖల కేటాయింపుపై స్పష్టత అప్పుడే..
Pm Modi
Follow us

|

Updated on: Jun 10, 2024 | 8:18 AM

సంకీర్ణ ధర్మం పాటిస్తూ, మోదీ జంబో కేబినెట్‌ కూర్పు పూర్తయింది. ఇక యాక్షన్‌లోకి దిగే టైమొచ్చింది. అంతకంటే ముందు ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయి అన్నది ఆసక్తిగా మారింది. దీనికి సంబందించిన కొంత సమాచారం పార్టీ నేతల నుంచి వెలువడుతోంది. జూన్ 10 సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం జరగనుంది. మోదీ నేతృత్వంలో సమావేశానికి ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు హాజరుకానున్నారు. మధ్యాహ్నంకల్లా పోర్టుఫోలియోలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు వెల్లడైతే ఎవరికి ఏశాఖ కేటాయించారో స్పష్టం వస్తుంది. మోదీ టీమ్‌లో 30 మందికి కేబినెట్‌ ర్యాంక్‌ దక్కనున్నట్లు సమాచారం. ఐదుగురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయమంత్రులుగా అవకాశం కల్పించనున్నారు. కర్తవ్య నిర్వహణపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. 100రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంస్థాగత మార్పులపైనా త్వరలో మోదీ ఫోకస్‌ పెట్టనున్నారు.

కేబినెట్‌లో బీజేపీకి 61 మంత్రి పదవులు దక్కాయి. ఇక మిత్రపక్షాలకు 11 మంత్రిపదవులు కేటాయించారు. అంటే మిత్రపక్షాలకు 15 శాతం మంత్రిపదవులు దక్కాయి. టీడీపీకి రెండు, జేడీయూ 2, ఎల్‌జేపీ-1, జేడీఎస్‌-1, శివసేన-1, ఆర్‌పీఐ-1, ఆర్‌ఎల్డీ-1, ఏడీఎస్‌-1, హెచ్‌ఏఎం-1 పార్టీలకు మంత్రిపదవులు దక్కాయి. ఇందులో రెండోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు 36 మంది ఉండగా, కొత్త మంత్రులు కూడా 36 మంది ఉన్నారు. 43 మందికి మూడుసార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ గత రెండు కేబినెట్‌లతో పోల్చితే సంఖ్యాపరంగా ఈ కేబినెట్‌ సైజు పెద్దది. అంటే మొత్తం 72 మంది ఈ మంత్రిమండలిలో ఉన్నారు. కేబినెట్‌ సైజు పెరిగినా, సంకీర్ణ ధర్మం ప్రకారం మిత్రపక్షాలకు మంత్రిపదవులు కట్టబెట్టినా, కీలక శాఖలు మాత్రం బీజేపీ తన దగ్గరే ఉంచుకుంటుందని భావిస్తున్నారు. ఇక హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి అనుగుణంగా మోదీ సోషల్‌ ఇంజినీరింగ్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే NCP అజిత్‌ పవార్‌ మంత్రిపదవి తీసుకోకపోవడం ఆసక్తిగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!