AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంట్‌ను వేదిక చేసుకుని వివాదాలు సృష్టించకండి.. సోనియా లేఖపై మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధానం

ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును కూడా రాజకీయం చేయాలని, వివాదాలు లేని చోట అనవసర వివాదాలు సృష్టించాలని ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 85 ప్రకారం.. రాజ్యాంగ ఆదేశాన్ని అనుసరించి పార్లమెంటు సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయని మీకు తెలుసని, పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందిన వెంటనే, సెప్టెంబర్ 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారని అన్నారు. పార్లమెంటు..

పార్లమెంట్‌ను వేదిక చేసుకుని వివాదాలు సృష్టించకండి.. సోనియా లేఖపై మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధానం
Sonia Gandhi Pralhad Joshi
Subhash Goud
| Edited By: |

Updated on: Sep 06, 2023 | 7:21 PM

Share

ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పొలిటికల్‌ పార్టీలను సంప్రదించకుండా ఈ పార్లమెంట్‌ సెషన్స్‌ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇక సోనియా గాంధీ లేఖపై కేంద్ర పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. సెప్టెంబరు 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిన విధానాలు, సంప్రదాయాలను పాటించిన తర్వాతే సమావేశాలు ఏర్పాటు చేశామని, సెషన్‌కు పిలిచే ముందు రాజకీయ పార్టీలు ఎప్పుడూ సంప్రదించలేదని, సోనియా గాంధీ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే చర్చించామన్నామని సమాధానం ఇచ్చారు. అలాగే వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆ అంశాలన్నింటిపై ప్రభుత్వం స్పందించిందని అన్నారు.

ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును కూడా రాజకీయం చేయాలని, వివాదాలు లేని చోట అనవసర వివాదాలు సృష్టించాలని ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 85 ప్రకారం.. రాజ్యాంగ ఆదేశాన్ని అనుసరించి పార్లమెంటు సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయని మీకు తెలుసని, పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందిన వెంటనే, సెప్టెంబర్ 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారని అన్నారు. పార్లమెంటు సమావేశాలను నిర్వహించే ముందు రాజకీయ పార్టీలు ఎప్పుడూ చర్చించడం ఉండదని, అలాగే సమస్యల గురించి ఎప్పుడూ చర్చించలేదని అన్నారు. రాష్ట్రపతి సమావేశాన్ని పిలిచిన తర్వాత, అలాగే సెషన్ ప్రారంభానికి ముందు, అన్ని పార్టీల నాయకుల సమావేశం జరుగుతుందని మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే పార్లమెంటులో తలెత్తే సమస్యల గురించి సభలో చర్చించడం జరుగుతుందన్నారు.

సమస్యపై చర్చకు ఎప్పుడూ సిద్ధమే

కాగా, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మీరు ప్రస్తావించిన అంశాలన్నీ లేవనెత్తగా, వాటిపై ప్రభుత్వం కూడా సమాధానమిచ్చిందని అన్నారు. సమస్యలపై సభలో చర్చించేందుకు ఎప్పుడు కూడా సిద్ధమేనని మంత్రి వివరించారు.

పార్లమెంట్‌ను రాజకీయ వివాదాలకు ఉపయోగించకూడదు:

పార్లమెంట్‌ వేదికను రాజకీయ వివాదాలకు ఉపయోగించకూడదన్నారు. ఇది కాకుండా, రాబోయే సెషన్‌ను సజావుగా నడపడానికి మీ పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. సభ సజావుగా సాగితే సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించుకునేందుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాసిన లేఖలో..

సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి ఎటువంటి అజెండా జాబితా చేయబడలేదని, మణిపూర్‌లో హింస, ధరల పెరుగుదలతో సహా తొమ్మిది అంశాలను చర్చకు లేవనెత్తాలని సూచించారు. సోనియా గాంధీ జాబితా చేసిన అంశాలలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మతపరమైన ఉద్రిక్తతల కేసులు పెరగడం, చైనా సరిహద్దు ఉల్లంఘనలు, అదానీ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలను దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) డిమాండ్ ఉన్నాయి.

Follow Us
తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ..
తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ..
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్