AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Kedarnath Visit: నేడు కేదార్‌నాథ్‌ పర్యటనకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

మోడీ రాకను పురస్కరించుకుని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను రెండు క్వింటాళ్ల పూలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కంటే ముందుగా కేదార్‌నాథ్‌కు చేరుకునే ప్రధాని.. బాబా కేదార్‌ను దర్శించుకుని పూజలు చేయనున్నారు.

PM Modi Kedarnath Visit: నేడు కేదార్‌నాథ్‌ పర్యటనకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
Pm Narendra Modi
Basha Shek
|

Updated on: Oct 21, 2022 | 8:03 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం (అక్టోబర్‌21) కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను దర్శించుకోనున్నారు. రూ.3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్‌నాథ్‌-బద్రీనాథ్‌ ప్రాంతాల్లో భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. అన్ని చోట్లా భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రధాని రెండు రోజుల కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మోడీ రాకను పురస్కరించుకుని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను రెండు క్వింటాళ్ల పూలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కంటే ముందుగా కేదార్‌నాథ్‌కు చేరుకునే ప్రధాని.. బాబా కేదార్‌ను దర్శించుకుని పూజలు చేయనున్నారు. దీని తర్వాత 9.7 కి.మీ పొడవున గౌరీకుండ్-కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక ప్రధాని మోడీ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌ను ఎలా ఉందంటే?

  • ప్రధాని మోదీ ఉదయం 8:30 గంటలకు కేదార్‌నాథ్ ధామ్‌ను దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు.
  • ఉదయం 9 గంటలకు కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
  • అనంతరం ఆదిగురువు శంకరాచార్యుల సమాధి ప్రదేశాన్ని సందర్శించనున్నారు.
  • ఉదయం 9:25 గంటలకు, మందాకి యొక్క అస్త పథం మరియు సరస్వతి అస్త పథంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ప్రధాని మోదీ సమీక్షిస్తారు.
  • ఆ తర్వాత ప్రధాని మోదీ బద్రీనాథ్ చేరుకుని శ్రీ బద్రీనాథ్ ఆలయంలో దర్శనం, పూజలు చేస్తారు.
  • మధ్యాహ్నం 12 గంటలకు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తారు.
  • మధ్యాహ్నం 12:30 గంటలకు మన గ్రామంలో రోడ్డు, రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
  • అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అరైవల్ ప్లాజా, సరస్సుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తారు.
  • బద్రీనాథ్‌లో రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 7.15 గంటలకు హోటల్‌ నుంచి హెలిప్యాడ్‌కు బయలుదేరి డెహ్రాడూన్‌కు బయలుదేరుతారు.

ఉత్తరాఖండ్‌ అభివృద్ధిలో మైలురాయి..

కాగా తన రెండున్నర గంటల కార్యక్రమంలో ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని కూడా సందర్శించనున్నారు మోడీ. దీంతో పాటు కేదార్‌నాథ్‌లోని మందకి అస్త పథం, సరస్వతీ అస్థి పథాలను మోడీ పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ఆ తర్వాత బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుని ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన అనంతరం రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పురోగతిని ప్రధాని సమీక్షిస్తారు. అలాగే మధ్యాహ్నం బద్రీనాథ్ సమీపంలోని సీమంత్ మన గ్రామంలో రోడ్డు, రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అరైవల్ ప్లాజా, చెరువుల సుందరీకరణ పనుల పురోగతిని సమీక్షిస్తారు. కాగా శుక్రవారం రాత్రి బద్రీనాథ్‌లో బస చేయనున్నారు ప్రధాని. ప్రధానమంత్రి కేదార్‌నాథ్-బద్రీనాథ్ పర్యటన ఉత్తరాఖండ్ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..