AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudarshan Setu: దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జి ‘సుదర్శన్ సేతు’ను జాతికి అంకితం చేసిన మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. దేవభూమి ద్వారక వద్ద, అరేబియా సముద్రం మీదుగా దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జి 'సుదర్శన్ సేతు'ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దీని నిర్మాణానికి దాదాపు 980 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని, బాట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది. దీనికి ముందు, ప్రధాని మోదీ ఆదివారం ఉదయం..

Sudarshan Setu: దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జి 'సుదర్శన్ సేతు'ను జాతికి అంకితం చేసిన మోడీ
Pm Modi
Subhash Goud
|

Updated on: Feb 25, 2024 | 11:05 AM

Share

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. దేవభూమి ద్వారక వద్ద, అరేబియా సముద్రం మీదుగా దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జి ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దీని నిర్మాణానికి దాదాపు 980 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని, బాట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది. దీనికి ముందు, ప్రధాని మోదీ ఆదివారం ఉదయం బెట్ ద్వారకను సందర్శించి బ్రిడ్జిని ప్రారంభించారు. ముందుగా బాట్‌ ద్వారక ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఎక్కడ పూజలు నిర్వహించి 52 వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించారు.

దేశంలోని అతి పొడవైన బ్రిడ్జి

ఇవి కూడా చదవండి

ఈ వంతెన భారతదేశపు అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్. దీని ఫుట్‌పాత్ పై భాగంలో సౌర ఫలకాలను అమర్చారు. ఈ సోలార్ ప్యానెల్స్ 1 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వంతెనకు 2017 అక్టోబర్‌లో ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నాలుగు లేన్లు, రెండు వైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు నిర్మించారు. ఈ వంతెన చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సందర్శించే పర్యాటకులందరికీ కేంద్రంగా ఉంటుంది. వంతెనపై అద్భుతమైన కళాఖండాలు కనిపిస్తాయి. సుదర్శన్ వంతెన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. దాని కాలిబాటను భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీ కృష్ణుడి చిత్రాలతో అలంకరించారు. సుదర్శన్ సేతు 2.32 కిలోమీటర్ల పొడవుతో ఇప్పటివరకు భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్టెడ్ వంతెన. ఈ వంతెన నిర్మాణానికి మొత్తం రూ.980 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని, బెట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి