AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI: ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ.. మీరూ మోదీని ఏదైనా అడగాలనుకుంటున్నారా.? ఇలా చేయండి..

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒత్తిడి ఎదురవడం సర్వ సాధారణమైన విషయం. ఈ ఒత్తిడిని జయించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ ఏటా.. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులకు పలు చిట్కాలు, ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే..

PM MODI: ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ.. మీరూ మోదీని ఏదైనా అడగాలనుకుంటున్నారా.? ఇలా చేయండి..
Pm Modi Pariksha Pe Charcha
Narender Vaitla
|

Updated on: Jan 18, 2023 | 1:52 PM

Share

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒత్తిడి ఎదురవడం సర్వ సాధారణమైన విషయం. ఈ ఒత్తిడిని జయించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ ఏటా.. ‘పరీక్షా పే చర్చ‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులకు పలు చిట్కాలు, ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే మెలుకువల గురించి వివరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 27వ తేదీ ప్రధాని విద్యార్థులతో ముచ్చటించనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని తల్కటరా స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు 9 నుంచి 12వ తరగతి చదువుతున్న వారై ఉండాలి. కేవలం విద్యార్థులే కాకుండా పేరెంట్స్‌, ఉపాధ్యాయులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. పరీక్షా పే కార్యక్రమంలో పాల్గొనలానుకునే వారు నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 30 వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సుమారు రెండు వేలకుపైగా మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఎన్సీఆర్టీఏ తరఫున సర్టిఫికేట్‌తో పాటు ఎగ్జామ్స్‌ వారియర్స్‌ అనే పుస్తకాన్ని అందిస్తారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మీరూ వర్చువల్‌ పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను ప్రధానిని అడిగే వీలు కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు తమ సందేహాన్ని వీడియోగా తీసి మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ సందేహాలను ప్రధానమంత్రిని అడుగుదామని అనుకుంటే HD క్వాలిటీ వీడియోని pibhyderabad@gmail.com మెయిల్ ఐడికీ పంపించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్