AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. వక్ఫ్-మణిపూర్ హింస సహా పలు అంశాలపై చర్చ..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వక్ఫ్ బిల్లు బ్యాంకింగ్ చట్టాలు మణిపూర్ హింసాకాండ సహా అనేక సమస్యలపై నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్నాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో సహా 16 బిల్లులను డిసెంబర్ 20 వరకు నిర్వహించనున్నారు. వక్ఫ్ (సవరణ) బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది. ఈ సెషన్‌లో ప్యానెల్ తన నివేదికను సమర్పించబోతోంది.

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు  ప్రారంభం.. వక్ఫ్-మణిపూర్ హింస సహా పలు అంశాలపై చర్చ..
Parliament Winter Session
Surya Kala
|

Updated on: Nov 25, 2024 | 8:23 AM

Share

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి (నవంబర్ 25 సోమవారం) ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, జార్ఖండ్‌లో భారత కూటమి విజయం సాధించిన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ శీతాకాల సమావేశాల సెషన్ డిసెంబర్ 20 వరకు కొనసాగుతుంది. వక్ఫ్ చట్టంతో సహా 16 బిల్లులు ఈ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు అదానీ కేసు కూడా చర్చలోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం నాడు.. ఇండియా బ్లాక్ పార్టీ నేతల సమావేశానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై వ్యూహం రచించనున్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రతిపక్షాలు మణిపూర్, వక్ఫ్ బిల్లు , అదానీతో పాటు పలు సమస్యలకు సంబంధించిన అంశాలను లేవనెత్తవచ్చు, అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో విజయం తర్వాత BJPసహా NDA ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో మహారాష్ట్రలో ఓడిపోయినప్పటికీ రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కేరళలో ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. శీతాకాల సమావేశాల నుంచి ఆమె తొలిసారిగా పార్లమెంటరీ జీవిత యాత్రను ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

మంత్రి కిరణ్ రిజిజు పార్టీలతో సమావేశం

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం పార్లమెంటులోని ఎగువ , దిగువ సభలలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. రిజిజుతో భేటీ సందర్భంగా అదానీ గ్రూప్‌పై అమెరికా ప్రాసిక్యూటర్ల లంచం ఆరోపణలపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరాయి. ఉభయ సభల్లో లేవనెత్తే అంశాలను స్పీకర్ సమ్మతితో అధీకృత కమిటీలు నిర్ణయిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు మాట్లాడుతూ లోక్‌సభ, రాజ్యసభలు సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

వక్ఫ్ చట్టంతో సహా 16 బిల్లులు జాబితా సిద్ధం

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20 వరకు జరిగే సమావేశాల కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో సహా 16 బిల్లులను జాబితా చేసింది. వక్ఫ్ (సవరణ) బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది. ఈ సెషన్‌లో ప్యానెల్ తన నివేదికను సమర్పించబోతోంది. ప్యానెల్ తన నివేదికను సమర్పించడానికి సమయం పొడిగించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.

అందిన సమాచారం ప్రకారం ఈ సెషన్‌లో ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదించడం కోసం ఐదు బిల్లులు జాబితా చేయబడ్డాయి. అయితే 10 బిల్లులు పరిశీలన, ఆమోదం కోసం జాబితా చేయబడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో