AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ్ మేళాలో ‘ మహా కుంభకోణం’ ! లక్ష ఫేక్ కోవిద్ టెస్టులు నిర్వహించిన ప్రైవేట్ ల్యాబ్ లు…దర్యాప్తు ప్రారంభం

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో భారీ కోవిద్ టెస్ట్ స్కామ్ బయటపడింది. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన మహా కుంభ్ మేళా సందర్భంగా కొన్ని ప్రైవేట్ ల్యాబ్ లు దాదాపు లక్ష ఫేక్ కోవిద్ టెస్టులు నిర్వహించాయని తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు.

కుంభ్  మేళాలో ' మహా కుంభకోణం' ! లక్ష ఫేక్  కోవిద్ టెస్టులు నిర్వహించిన ప్రైవేట్ ల్యాబ్ లు...దర్యాప్తు ప్రారంభం
One Lakh Fake Covid Tests In Kumbh Mela
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 17, 2021 | 1:46 PM

Share

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో భారీ కోవిద్ టెస్ట్ స్కామ్ బయటపడింది. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన మహా కుంభ్ మేళా సందర్భంగా కొన్ని ప్రైవేట్ ల్యాబ్ లు దాదాపు లక్ష ఫేక్ కోవిద్ టెస్టులు నిర్వహించాయని తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ స్కామ్ కి పాల్పడిన ల్యాబ్ లపై కేసు నమోదు చేయాలని హరిద్వార్ జిల్లా అధికారులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇవి లక్షకు పైగానే బూటకపు టెస్ట్ రిపోర్టులను జారీ చేసినట్టు భావిస్తున్నారు. ఈ మహా మేళాను పురస్కరించుకుని కోవిద్ వ్యాప్తి కాకుండా చూసేందుకు రోజూ 50 వేల టెస్టులు నిర్వహించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ..ఈ నేపథ్యంలో ఈ టార్గెట్ ను పూర్తి చేసేందుకు ఈ ల్యాబ్ లు ఇలా అనుచిత..అక్రమ పద్ధతికి పాల్పడ్డాయని తెలుస్తోంది. సుమారు 22 ప్రైవేటు ల్యాబ్ లను అద్దెకు తీసుకోగా,, మరో 9 ల్యాబ్ లు కూడా ప్రభుత్వ ఆధ్వర్యాన టెస్టులు జరిపాయి. భక్తులు, యాత్రికుల పేర్లు, వారి ఐడెంటిటీ కార్డుల ఆధారంగా ర్యాండమ్ గా వీటిని నిర్వహించినట్టు చెబుతున్నారు.

దర్యాప్తు పూర్తి అయ్యేంతవరకు ఈ ల్యాబ్ లకు డబ్బు కూడా చెల్లించరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల స్కామ్ జరిగినట్టు తెలియగానే మొదటిసారి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం మళ్ళీ రెండోసారి దర్యాప్త్హు చేయాలనీ సూచించింది. మహా కుంభ్ మేళాకు సుమారు 70 లక్షల మంది భక్తులు, యాత్రికులు హాజరయ్యారని అంచనా. ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందంగా వచ్చిన అధికారులు కూడా హరిద్వార్ జిల్లా అధికారులకు ఈ దర్యాప్తులో సహకరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.

కన్నీరు కారుస్తున్న రాముడు… ఎందుకో తెలుసా.?ఖమ్మం జిల్లాలో వైరల్ గా మారిన వీడియో :Lord Rama Tears Video.

వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని అఖిల్..హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..Akhil Akkineni video.