Odisha Train Tragedy: 4 నెలలు గడుస్తోన్నా.. ఇంకా మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు!

ఒడిసా మూడు రైళ్ల దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉంది. దేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా ఇండియన్‌ రైల్వే ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల యాక్సిడెంట్‌ను పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 2వ తేదీన ఓడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 297 మంది మరణించగా, 1100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇంకా 28 మృతదేహాలను..

Odisha Train Tragedy: 4 నెలలు గడుస్తోన్నా.. ఇంకా మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు!
Odisha Train Tragedy
Follow us

|

Updated on: Oct 09, 2023 | 2:58 PM

భువనేశ్వర్‌, అక్టోబర్‌ 9: ఒడిసా మూడు రైళ్ల దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉంది. దేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా ఇండియన్‌ రైల్వే ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల యాక్సిడెంట్‌ను పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 2వ తేదీన ఓడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 297 మంది మరణించగా, 1100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇంకా 28 మృతదేహాలను గుర్తించలేదు. ప్రమాదం తర్వాత మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. వాటిల్లో 28 మృతదేహాలు ఇప్పటికీ మార్చురీలోనే ఉన్నాయి. ఈ మృతదేహాలను తొలగించే బాధ్యతలను రైల్వే విభాగం భువనేశ్వర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. వీరిని శాస్త్రీయంగా ఖననం చేసేందుకు పౌర సంస్థ ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని జారీ చేసింది.

ఆ మృతదేహాలకు సంబంధించిన వారు ఎవ్వరూ రాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులే ఆ 28 డెడ్‌బాడీస్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఓపీ జారీ చేశారు. సీబీఐ అధికారుల సమక్షంలో మృతదేహాలను కార్పొరేషన్‌కు అప్పగిస్తామని, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని బీఎమ్సీ మేయర్ సులోచన దాస్ మీడియాకు తెలిపారు. రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మృతదేహాలకు శాస్త్రీయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. దీంతో బీఎమ్సీ ఈ మేరకు మృతదేహాల ఖననం ప్రక్రియను ప్రారంభించిందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర, కేంద్రం, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ల నియమనిబంధనల ప్రకారం భువనేశ్వర్ ఎయిమ్స్‌ డైరెక్టర్ మృతదేహాలను దహన సంస్కారాల కోసం బీఎమ్‌సీ ఆరోగ్య అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. బీఎమ్సీ జారీ చేసిన SOP ప్రకారం మొత్తం ప్రక్రియ వీడియో తీయనున్నట్లు ఆయన వివరించారు.

కాగా ఈ ఏడాది జూన్‌ 2న సాయంత్రం 7 గంటల సమయంలో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ రైలు ప్రమాద ఘటన జరిగిన తర్వాత 162 మృతదేహాలను నగరంలో భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కు తరలించగా.. అందులో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎన్‌ఏ టెస్టుల అనంతరం మరో 53 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే వీటిల్లో 28 మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదని అధికారులు తెలిపారు. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ నుంచి సేకరించిన ఐదు డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో ఈ మృతదేహాలను భద్రపరిచారు. ఈ మృతదేహాల కోసం ఇప్పటి వరకూ ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వమే మృతదేహాలకు లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నవరాత్రులలో 4వ రోజు కూష్మాండ ఆరాధన, విధానం నైవేద్యం మంత్రం మీకోసం
నవరాత్రులలో 4వ రోజు కూష్మాండ ఆరాధన, విధానం నైవేద్యం మంత్రం మీకోసం
కారులో దుస్తులు మార్చుకున్న హీరోయిన్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్.
కారులో దుస్తులు మార్చుకున్న హీరోయిన్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్.
ఆరోగ్యానికి మంచిదే.. కానీ, బాదం ఎప్పుడు తినాలో తెలుసా..?
ఆరోగ్యానికి మంచిదే.. కానీ, బాదం ఎప్పుడు తినాలో తెలుసా..?
ఆ సూపర్ బైక్స్‌పై తగ్గింపుల జాతర.. డిస్కౌంట్ ఎంతంటే..?
ఆ సూపర్ బైక్స్‌పై తగ్గింపుల జాతర.. డిస్కౌంట్ ఎంతంటే..?
ఆయువుపట్టులోనే మావోలకు కోలుకోలేని దెబ్బ!
ఆయువుపట్టులోనే మావోలకు కోలుకోలేని దెబ్బ!
యానిమల్ హీరోయిన్‎ను ఏడిపించిన సినిమా అదే..
యానిమల్ హీరోయిన్‎ను ఏడిపించిన సినిమా అదే..
ఈ వాస్తు దోషాలా.. వ్యాధులకు వెల్‌కమ్‌ చెబుతున్నట్లే..
ఈ వాస్తు దోషాలా.. వ్యాధులకు వెల్‌కమ్‌ చెబుతున్నట్లే..
సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఎస్‌జే సూర్య.! ఆయనే దిక్కు అనేలా..
సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఎస్‌జే సూర్య.! ఆయనే దిక్కు అనేలా..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
పిచ్చి పీక్‌స్టేజ్‌లో రీల్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్ వీడియో వైరల
పిచ్చి పీక్‌స్టేజ్‌లో రీల్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్ వీడియో వైరల
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..