AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Rice Mill Owner : టీచర్ జాబ్ ని వదిలి వ్యాపారంగలోకి అడుగు.. సరికొత్త ఆలోచనతో.. వరిపొట్టు బిజినెస్ తో లక్షల్లో ఆదాయం

: కొంతమంది దొరికినదానితో తృప్తి పడతారు.. మరికొందరు ఎంత ఉన్నా సరిపోలేదంటూ నిత్య అసంతృప్తవాదులుగా నిరాశతో బతికేస్తారు.. ఇంకొందరు.. తాము బతుకుతూ.. నలుగురికి బతికేందుకు దారిచూపాలి అనుకుంటారు.. అటువంటి వారు సరికొత్తగా ఆలోచిస్తూ.. తాను ఆర్ధికంగా ఎదగడమే కాదు..

Odisha Rice Mill Owner : టీచర్ జాబ్ ని వదిలి వ్యాపారంగలోకి అడుగు.. సరికొత్త ఆలోచనతో.. వరిపొట్టు బిజినెస్ తో లక్షల్లో ఆదాయం
Surya Kala
|

Updated on: Feb 10, 2021 | 2:25 PM

Share

Odisha Rice Mill Owner : కొంతమంది దొరికినదానితో తృప్తి పడతారు.. మరికొందరు ఎంత ఉన్నా సరిపోలేదంటూ నిత్య అసంతృప్తవాదులుగా నిరాశతో బతికేస్తారు.. ఇంకొందరు.. తాము బతుకుతూ.. నలుగురికి బతికేందుకు దారిచూపాలి అనుకుంటారు.. అటువంటి వారు సరికొత్తగా ఆలోచిస్తూ.. తాను ఆర్ధికంగా ఎదగడమే కాదు.. పదిమందికి జీవనోపాధిని కలిగిస్తారు. డబ్బు సంపాదించడానికి చాలా అప్షన్లున్నాయి. ఉద్యోగం , వ్యాపారం, ఇన్వెస్ట్ చేయడం ఇలా రకరకాలుగా డబ్బులను సంపాదిస్తూ వెనకేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ వ్యక్తి మాత్రం సరికొత్తగా అలోచించి పనికిరాదు అన్న వస్తువుతో లక్షల్లో డబ్బులు ఆర్జిస్తున్నాడు. ఆ కొత్త ఆవిష్కరణ ఏమిటో తెలుసుకుందాం..!

ఒడిశా లోని కలహంది కి చెందిన బిభు సాహు అనే ఒక వ్యక్తి టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయితే ఆ జాబ్ కి 2007లో గుడ్ బై చెప్పేశారు. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. రైస్ మిల్లు బిసినెస్ లోకి వచ్చారు. రైస్ మిల్లు వ్యాపారంతో ఏటా దాదాపు 3 టన్నుల పొట్టు వచ్చేది. ఒకప్పుడు ఈ పొట్టుతో హోటల్స్ లో పొయ్యలు.. ఇటుకలను మండించడానికి ఉపయోగించేవారు.. అయితే ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ బియ్యం పొట్టుకు విలువలేకుండా పోయింది. దీంతో బిభు సాహుకి ఆ పొట్టుని ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. దాన్ని ఊరి బయట కాల్చేసేవారు. దీంతో వాతావారణ కాల్యుష్యం పెరిగేది. అదీ కాకుండా చుట్టుపక్కల చాలా మంది వచ్చి ఫిర్యాదు చేసేవారు దీంతో దీన్ని ఏమైనా చేయాలని ఆలోచించారు. దీంతో ఒక వేర్‌హౌస్‌లో ఈ పొట్టును పెట్టేవారు. కానీ అది కూడా ఫుల్ అయిపోయేది. దీంతో సాహు రీసెర్చ్ చేశాడు.

వరి పొట్టును స్టీల్ పరిశ్రమలో థర్మల్ ఇన్సులేటర్‌గా వాడొచ్చనే ఐడియాకు వచ్చారు. అయితే దీన్ని ఎలా అమలు చేయాలో అర్థం కాలేదు. దీంతో సాహు నిపుణులను కలిశాడు. వారు కూడా సరైన పరిష్కారం చూపించలేకపోయారు. దీంతో బిభు సాహు తన ఆలోచనలకూ పదును పెట్టాడు. ఇంతలో అతని స్నేహితుడు ఒకరు కొంత సమయం కావాలని అడిగి ఊరెళ్లి నలుగురు వ్యక్తులను తీసుకువచ్చాడు. వీరందరూ కలిసి పని చేశారు. చివరకు సాధించారు.

వరి పొట్టును చిన్న చిన్న గుండ్ల లేదా గుళికలుగా తయారు చేశారు. దీంతో సాహు విదేశాల్లోని కంపెనీలను కలిశాడు. వాటికి ఇమెయిల్ పంపాడు. 2019లో తొలి లోడ్‌ను సౌదీ అరేబియాకు పంపాడు. ఆ ఏడాది 100 టన్నుల గుళికల ద్వారా ఏకంగా రూ.20 లక్షలు సంపాదించాడు. వరి పొట్టు గుళికల ప్రపంచవ్యాప్తంగా ఉక్కు కంపెనీలకు ఎగుమతి చేయడం ప్రారంభించాడు మరియు ఇప్పుడు దాని నుండి లక్షలు సంపాదిస్తున్నాడు. వరి పొట్టును బంగారంగా మార్చుకున్నాడు. చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. హరిప్రియా అగ్రో ఇండస్ట్రీస్ నడుపుతున్న భీభు సాహు ఒడిశా లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా ఖ్యాతి గాంచాడు.

Also Read:

కలిసోచ్చిన సోషల్ మీడియా వైరల్.. డబ్బే డబ్బు.. ఇంట్లో చేసిన వంటకాలతో వ్యాపారం చేస్తున్న గృహిణీ..

చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!