Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం

పంజాబ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానా, హోషైర్‌పూర్‌కు చెందిన కొందరు భక్తులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హర్యానాలోని నుహ్ జిల్లా కుండ్లీ-మనేసర్-పల్వాల్‌ సమీపంలో తౌరులో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది..

Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
Bus Fire Accident
Srilakshmi C
|

Updated on: May 19, 2024 | 9:57 AM

Share

చండీఘడ్‌, మే 19: పంజాబ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానా, హోషైర్‌పూర్‌కు చెందిన కొందరు భక్తులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హర్యానాలోని నుహ్ జిల్లా కుండ్లీ-మనేసర్-పల్వాల్‌ సమీపంలో తౌరులో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో KMPలోని టౌరు సమీపంలో బస్సులో 60 మంది భక్తులతో వెళ్తున్న బస్సులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బస్సులోని వారంతా పంజాబ్‌లోని లూథియానా, హోషియార్‌పూర్‌కు చెందినవారిగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఉజ్జన్, మధుర-బృందావనం సందర్శించి తిరిగి వస్తుండగా కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలను చూసిన కొందరు స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. తొమ్మిది మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. దాదానె 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

బస్సులో మంటలు చెలరేగడం చూసిన స్థానికులు.. డ్రైవర్‌ను పిలిచి అప్రమత్తం చేశారు. కానీ బస్సు ఆగకపోవడంతో.. మోటర్‌సైకిల్‌పై బస్సును వెంబడించి డ్రైవర్‌కు సమాచారం అందించామని, బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరామని తెలిపారు. అయితే అప్పటికే మంటలు వ్యాపించాయని, బస్సులోపలకు కూడా మంటలు చేరినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు సహా మొత్తం తొమ్మిది మంది సజీవంగా దహన మయ్యారు. మరో 15 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన వారంతా నిలకడగా ఉన్నారని, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి..
Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి..
సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి
సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి