AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA: ఆ ఉగ్రవాది ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన

ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ పూజారి హత్యకు కుట్ర పన్నింది అతడే... దీనికి నిజ్జర్ చీఫ్ గా ఉన్నాడు. గత ఏడాది భారత్ లో ఉగ్రకుట్రకు పాల్పడ్డాడనే కేసులో..

NIA: ఆ ఉగ్రవాది ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన
Ktf Terrorist
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2022 | 4:22 PM

Share

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భారీ రివార్డును ప్రకటించింది. గత ఏడాది జలంధర్‌లో హిందూ పూజారిని హత్య చేసిన కేసులో కెనడాకు చెందిన ఖలిస్తాన్‌ టైగర్‌ఫోర్స్‌(కేటీఎఫ్‌) చీఫ్‌పై సమాచారం ఇస్తే జాతీయ దర్యాప్తు సంస్థ రివార్డును ప్రకటించింది. హిందూ పూజారి హత్యకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్న హర్దీప్ పై రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ పూజారి హత్యకు కుట్ర పన్నింది. దీనికి నిజ్జర్ చీఫ్ గా ఉన్నాడు. గత ఏడాది భారత్ లో ఉగ్రకుట్రకు పాల్పడ్డాడనే కేసులో నిజ్జర్ పై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఈ మధ్య కెనడాలో మరణించిన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య కేసులోనూ హర్దీప్ సింగ్ పాత్రను తోసిపుచ్చలేమని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సహకరించే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఎన్‌ఐఏ తెలిపింది. నిందితులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించేందుకు ఎన్‌ఐఏ ఢిల్లీ ప్రధాన కార్యాలయం, చంఢీగఢ్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌లోని టెలిఫోన్‌, వాట్సాప్‌ మరియు టెలిగ్రామ్‌ నంబర్‌లను విడుదల చేశారు.

గతేడాది జనవరి 31న జలంధర్‌లోని ఫిల్లూరు గ్రామంలో హిందూ పూజారి కమల్‌దీప్‌ శర్మ హత్యకు గురయ్యాడు. నిజ్జర్‌తో సహా నలుగురిపై జూలై 5న ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ వారిపై అక్టోబర్‌8, 2021న కేసు నమోదు చేసింది. ఈ కేసులోని మరో ముగ్గురు నిందితులు కమల్‌జీత్‌ శర్మ, రామ్‌సింగ్‌ అలియాస్‌ సోనా, నిజ్జర్‌ అతని సహచరుడు ప్రభ్‌ సూచనల మేరకు పూజారిపై దాడి చేశారు. కెనడాకు చెందిన నిందితులు పూజారిని చంపడం ద్వారా పంజాబ్‌లో శాంతి, మత సామరస్యాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి