PM Modi 3.0: మూడోసారి ప్రధాన మంత్రి.. అద్వానీ సహా అగ్రనేతల అశీర్వాదం తీసుకున్న నరేంద్ర మోదీ..!

ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత బిజీ బిజీగా గడిపారు నరేంద్ర మోదీ. బీజేపీ సీనియర్ నేతలని కలిసి ఆశీర్వాదం తీసుకుని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము.

PM Modi 3.0: మూడోసారి ప్రధాన మంత్రి.. అద్వానీ సహా అగ్రనేతల అశీర్వాదం తీసుకున్న నరేంద్ర మోదీ..!
Modi Meets Bjp Stalwart
Follow us

|

Updated on: Jun 07, 2024 | 7:01 PM

ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత బిజీ బిజీగా గడిపారు నరేంద్ర మోదీ. బీజేపీ సీనియర్ నేతలని కలిసి ఆశీర్వాదం తీసుకుని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము.

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత, బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని కలిశారు నరేంద్ర మోదీ. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన వద్ద ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత అద్వానీకి పుష్పగుచ్ఛం అందించారు మోదీ. అద్వానీ కుమార్తె ప్రతిభ కూడా అక్కడే ఉన్నారు. అద్వానీ ఇంటి నుంచి నేరుగా బీజేపీ వ్యవస్థాపకుల్లో మరొకరు మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లారు మోదీ. ఆయన పుష్పగుచ్చం అందించి.. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. రెండు సార్లు బీజేపీ స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మెజారిటీ సాధించడంలో నేతలిద్దరూ పెద్దన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా నరేంద్ర మోదీ కలిశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి మోదీకి స్వీట్లు తినిపించారు. ఆయనను కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. కోవింద్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు, రాజ్యాంగ భవనంలోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు.

సాయంత్రం ఆరున్నరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఎన్డీఏ పక్ష నేత నరేంద్ర మోదీ. మిత్రపక్షాలు, ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సరిపడ బలం ఉందని చెప్పిన తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ.. అధికారికంగా మోదీకి లేఖ ఇచ్చారు రాష్ట్రపతి. ఆదివారం సాయంత్రం 6గంటలకు మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.

ఈసారి బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయేలో రెండో అతిపెద్ద పార్టీ టీడీపీ. వీరికి 16 మంది ఎంపీలు ఉన్నారు. అదే సమయంలో నితీష్ కుమార్ జేడీయూ మూడో స్థానంలో ఉంది. జేడీయూ ఈసారి 12 సీట్లు గెలుచుకుంది. ఇది కాకుండా, రామ్ విలాస్ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన, మహారాష్ట్రలో 5 మంది ఎంపీలు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!