black fungus infection: బ్లాక్ ఫంగ‌స్‌ చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు అయ్యింది.. అయినా కూడా

కరోనా వైరస్‌ను జ‌యించిన కొంద‌రిపై బ్లాక్​ఫంగస్ దాడి చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా...

black fungus infection:  బ్లాక్ ఫంగ‌స్‌ చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు అయ్యింది.. అయినా కూడా
1.5 Crore For Treatment Of Black Fungus
Follow us

|

Updated on: Jun 12, 2021 | 3:12 PM

కరోనా వైరస్‌ను జ‌యించిన కొంద‌రిపై బ్లాక్​ఫంగస్ దాడి చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా పూర్తి స్థాయిలో న‌యం అవుతుంద‌న్న గ్యారంటీ ల‌భించ‌డం లేదు. అలాంటి ఘటన తాజాగా మహారాష్ట్రలో జరిగింది. నాగ్​పుర్​లో గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిగా పనిచేస్తున్న నవీన్​ పాల్​కు గత ఏడాది సెప్టెంబర్​లో బ్లాక్​ఫంగస్ సోకింది. ఈ వ్యాధి​ నుంచి కోలుకోవడానికి రూ.1.48 కోట్లు ఖర్చు అయ్యాయి.

క‌రోనా నుంచి కోలుకున్న కొద్ది రోజులకు పాల్​కు కళ్ల సమస్య మొదలైంది. చికిత్స కోసం నాగ్​పుర్​, హైదరాబాద్​లోని డాక్ట‌ర్ల‌ను సంప్రదించాడు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పాల్​కు వచ్చిన సమస్యను డాక్ట‌ర్లు గుర్తించలేకపోయారు. దీంతో నవంబరులో పాల్​ ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చేరాడు. బ్లాక్​ఫంగస్​ సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు. ముంబైలోని హిందూజా ఆస్పత్రి డాక్ట‌ర్లు అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశారు. మెడిసిన్, ఇన్​జెక్షన్ల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవడం వల్ల నవీన్​ పాల్​.. నాగ్​పుర్​లోనే చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబరులో నాగ్​పుర్​ చేరుకున్న పాల్​.. అతని​ భార్య రైల్వే ఉద్యోగి కావడం వల్ల స్థానిక రైల్వే ఆస్పత్రిలో చేరాడు. అక్కడి డాక్ట‌ర్లు పాల్​ ఎడమ కన్ను సహా ఇన్ఫెక్షన్​కు గురైన నోటిలో కొంత భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం కళ్ల సమస్య కొంత తగ్గినట్లు పాల్​ తెలిపాడు.

Also Read: కదిలే రైలులో టాయిలెట్ ముందు వివాహం.. చాలా పెద్ద స్టోరీనే ఉంది

కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ