AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కదిలే రైలులో టాయిలెట్ ముందు వివాహం.. చాలా పెద్ద స్టోరీనే ఉంది

ప్రేమించే వారిని ఎవరూ ఆపలేరు. కుటుంబం, సమాజం ఎన్ని అడ్డంకుల ఉన్నప్పటికీ, ప్రేమించుకున్న వ్య‌క్తులు ఎల్లప్పుడూ ఒకరినొకరు....

Viral News: కదిలే రైలులో టాయిలెట్ ముందు వివాహం.. చాలా పెద్ద స్టోరీనే ఉంది
Moving Train Marriage
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2021 | 9:06 PM

Share

ప్రేమించే వారిని ఎవరూ ఆపలేరు. కుటుంబం, సమాజం ఎన్ని అడ్డంకుల ఉన్నప్పటికీ, ప్రేమించుకున్న వ్య‌క్తులు ఎల్లప్పుడూ ఒకరినొకరు కలవడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొంటారు. తాజాగా వివాహితురాలైన ఒక అమ్మాయి తన ప్రేమికుడిని రైలు మరుగుదొడ్డి ముందు వివాహం చేసుకుంది. ఈ కేసు బీహార్‌లోని సుల్తాంగంజ్‌లో వెలుగుచూసింది. కదిలే రైలులో తన ప్రేమికుడిని వివాహం చేసుకుని ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. భీర్ఖుర్ద్ లోని ఉధాదిహ్ గ్రామంలో నివ‌శించే అశు కుమార్ అనే వ్య‌క్తి అదే గ్రామానికి చెందిన అను కుమారితో చాలా సంవత్సరాలుగా ప్రేమ‌లో ఉన్నాడు. యువ‌తి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భంధించారు. ఏప్రిల్‌లో, కిరణ్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడితో ఆమెకు బ‌ల‌వంతంగా పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. 2 నెలల తరువాత ఆమె ఒక రోజు తన అత్తమామల ఇంటి నుండి తప్పించుకొని తన ప్రేమికుడిని కలుసుకుంది.

ఇద్దరూ సుల్తాంగంజ్ స్టేషన్‌కు చేరుకుని రైలులో బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్ర‌మంలో అశు కుమార్ ఆమెను కదిలే రైలు టాయిలెట్ ముందు వివాహం చేసుకున్నాడు. ఆపై ఆమె నుదిడిపై సింధూరం దిద్దాడు. ఈ జంట‌ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

Also Read: కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెంచింది.. తాజా అప్‌డేట్ ఇది