AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వు అసలు తల్లివేనా.. మూడు రోజుల బిడ్డను దారుణంగా.. ఏం జరిగిందంటే..?

సమాజంలో ఇంకా మగబిడ్డే కావాలనే ధోరణి పోవడం లేదు. ఈ ఆధునిక యుగంలోను ఆడబిడ్డ ఇంకా దారుణ వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. పైగా అది తల్లిదండ్రుల చేతుల్లోనే అవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని ఓ తల్లి దారుణానికి పాల్పడింది. అమ్మతనానికి మాయని మచ్చే తెచ్చే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

నువ్వు అసలు తల్లివేనా.. మూడు రోజుల బిడ్డను దారుణంగా.. ఏం జరిగిందంటే..?
Mother Kills Newborn Girl
Krishna S
|

Updated on: Nov 26, 2025 | 9:14 AM

Share

మగ పిల్లలపై విపరీతమైన ఆశ, ఆడపిల్లలపై వివక్ష మరో దారుణానికి కారణమైంది. కొడుకు లేడనే మనస్తాపంతో ఓ తల్లి కిరాతకానికి పాల్పడింది. మూడు రోజుల వయసున్న శిశువును చంపి అమ్మతనానికే మాయనిమచ్చ తెచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా రామ్‌దుర్గ్ తాలూకాలోని హిరేములంగి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

నిందితురాలు అశ్విని హల్కట్టికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె మగబిడ్డ కోసం ఆశగా ఎదురుచూసింది. నవంబర్ 23న ఆమెకు మళ్లీ ఆడ శిశువు జన్మించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అశ్విని, మంగళవారం ఉదయం తన తల్లి ఇంట్లో లేని సమయం చూసి, నవజాత శిశువును గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఆమె శిశువు ఊపిరి ఆడటం లేదని నటించి, అందరినీ నమ్మించడానికి ప్రయత్నించింది. శిశువును ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె గొంతు కోయడం వల్ల మరణించినట్లు ధృవీకరించారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. ఆమెపై సురేబన్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు.

కర్ణాటకలో కొనసాగుతున్న వివక్ష

ఆడపిల్లలపై వివక్ష కారణంగా ఇలాంటి దారుణాలు కర్ణాటకలో ఇది కొత్తేమీ కాదు. గతంలో 2024 ఫిబ్రవరి 29న ధార్వాడ్ జిల్లాలోని యాద్వాడ్ గ్రామంలో శంబులింగ షాహపూర్మత్ అనే తండ్రి.. రెండవ సంతానమైన తన ఏడు నెలల పాపను గోడకేసి కొట్టి చంపేశాడు. మగబిడ్డ పుట్టలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ప్రభుత్వ  ఆందోళన

రాష్ట్రంలో తగ్గుతున్న స్త్రీ-పురుష లింగ నిష్పత్తి పట్ల కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు ప్రకారం.. ఈ వివక్షకు పాక్షికంగా వ్యవస్థీకృత భ్రూణహత్యల రాకెట్లే కారణం. 2023-24 ప్రారంభం నుంచి ఆడ భ్రూణహత్యలకు సంబంధించి రాష్ట్రంలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వీటిలో 46 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.

ఆడ భ్రూణహత్యలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం PC – PNDT చట్టాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిలో కఠినంగా అమలు చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 136 కేసులు కోర్టులో దాఖలు చేయగా 74 కేసుల్లో జరిమానాలు విధించడం లేదా స్కానింగ్ కేంద్రాలను మూసివేయడం జరిగింది. మగపిల్లల కోసం ఆశతో అమాయక శిశువుల ప్రాణాలు తీస్తున్న ఈ దురాచారాన్ని అరికట్టడానికి చట్టం అమలుతో పాటు సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us