Mob attacked on Cop: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.. పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్థులు దాడి! ఏం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం కనబడకుండా పోయిన మహిళ శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. మహిళ కనబడకుండా పోయిన దాదాపు రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీసిన నేపథ్యంలో బీహార్‌లోని నవ్‌గాచియాలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి..

Mob attacked on Cop: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.. పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్థులు దాడి! ఏం జరిగిందంటే..
Bihar Mob Attacked On Cop
Follow us

|

Updated on: Feb 18, 2024 | 5:44 PM

బీహార్‌, ఫిబ్రవరి 18: రెండు రోజుల క్రితం కనబడకుండా పోయిన మహిళ శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. మహిళ కనబడకుండా పోయిన దాదాపు రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీసిన నేపథ్యంలో బీహార్‌లోని నవ్‌గాచియాలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస్‌ కవర్ చేయడానికి సంఘటనా స్థలానికి వచ్చిన జర్నలిస్టులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

శోభాదేవి అనే మహిళ ఫిబ్రవరి 16వ తేదీ (శుక్రవారం)న పాలు అమ్మేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఆమె బ్రతికి ఉండేదని, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ పోలీసులపై స్థానికులు దాడి చేశారు. పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ వారు చర్య తీసుకోలేదని ఆగ్రహించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా గత ఏడాది ప్రారంభంలో బీహార్‌లోని నౌగాచియాలో నివాసి ఇంటిపై దాడి చేసిన పోలీసు సిబ్బందిపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లోని నౌగాచియాలోని ఒక నివాసి ఇంటిపై దాడి చేస్తున్న పోలీసు సిబ్బందిపై గ్రామస్తుల బృందం దాడి చేసింది. బాధితుడి భార్య, బిడ్డపై దాడి చేయడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ మేరకు పోలీసు బృందంపై దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.