AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mob attacked on Cop: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.. పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్థులు దాడి! ఏం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం కనబడకుండా పోయిన మహిళ శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. మహిళ కనబడకుండా పోయిన దాదాపు రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీసిన నేపథ్యంలో బీహార్‌లోని నవ్‌గాచియాలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి..

Mob attacked on Cop: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.. పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్థులు దాడి! ఏం జరిగిందంటే..
Bihar Mob Attacked On Cop
Srilakshmi C
|

Updated on: Feb 18, 2024 | 5:44 PM

Share

బీహార్‌, ఫిబ్రవరి 18: రెండు రోజుల క్రితం కనబడకుండా పోయిన మహిళ శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. మహిళ కనబడకుండా పోయిన దాదాపు రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీసిన నేపథ్యంలో బీహార్‌లోని నవ్‌గాచియాలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస్‌ కవర్ చేయడానికి సంఘటనా స్థలానికి వచ్చిన జర్నలిస్టులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

శోభాదేవి అనే మహిళ ఫిబ్రవరి 16వ తేదీ (శుక్రవారం)న పాలు అమ్మేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఆమె బ్రతికి ఉండేదని, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ పోలీసులపై స్థానికులు దాడి చేశారు. పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ వారు చర్య తీసుకోలేదని ఆగ్రహించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా గత ఏడాది ప్రారంభంలో బీహార్‌లోని నౌగాచియాలో నివాసి ఇంటిపై దాడి చేసిన పోలీసు సిబ్బందిపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లోని నౌగాచియాలోని ఒక నివాసి ఇంటిపై దాడి చేస్తున్న పోలీసు సిబ్బందిపై గ్రామస్తుల బృందం దాడి చేసింది. బాధితుడి భార్య, బిడ్డపై దాడి చేయడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ మేరకు పోలీసు బృందంపై దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే