AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజరాజుల బీభత్సం.. వణికిపోతున్న కృష్ణగిరి జిల్లా

హోసూరు సమీప గ్రామాల ప్రజలకు గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏనుగుల గుంపు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. లేదంటే జనావాసాల్లోకి ఎంట్రీ ఇస్తూ భయపెడుతున్నాయి. ఇళ్లల్లోంచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఏనుగుల సంచారంపై చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.

గజరాజుల బీభత్సం.. వణికిపోతున్న కృష్ణగిరి జిల్లా
Elephants
Ram Naramaneni
|

Updated on: Feb 18, 2024 | 4:00 PM

Share

గజరాజుల బీభత్సానికి.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా గజగజ వణికిపోతుంది. ఏనుగుల గుంపు ఎటువైపు నుంచి.. ఎలా వచ్చి మీద పడి దాడి చేస్తాయోనని హోసూరు పరిసర ప్రాంతవాసులు హడలిపోతున్నారు. ఆవేశంతో ఉగిపోతూ ఘీంకారాలు చేస్తూ విచక్షణారహితంగా ఎటాక్ చేస్తుండటంతో జనం భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. కాపాడండి మహా ప్రభో అంటూ ఫారెస్ట్ అధికారుల్ని వేడుకుంటున్నారు.

హోసూరు సమీప గ్రామాల ప్రజలకు గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏనుగుల గుంపు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. లేదంటే జనావాసాల్లోకి ఎంట్రీ ఇస్తూ భయపెడుతున్నాయి. ఇళ్లల్లోంచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఏనుగుల సంచారంపై చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఊళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ ఏనుగు బీభత్సానికి ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.

ఇద్దరు మహిళలు చనిపోవడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఏనుగులు మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గంటలకొద్ది ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలన్నారు. ఆందోళనతో దిగొచ్చిన అధికారులు.. ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.