AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం పిచ్చితండ్రి..! ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికేశాడు.. అడ్డొచ్చిన వారిపై వేటు..!

దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు అతడి భార్య, మనవడిపై కూడా దాడి చేశాడు. దాంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు.

అయ్యో పాపం పిచ్చితండ్రి..! ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికేశాడు.. అడ్డొచ్చిన వారిపై వేటు..!
Crime
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2023 | 8:43 PM

Share

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పర్బత్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్ధాని గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని ఒక వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి చంపేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు అతడి భార్య, మనవడిపై కూడా దాడి చేశాడు. దాంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు పర్బత్‌సర్‌కు చెందిన మనారామ్ (57)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు తెలిపారు.

మనారామ్ తన కుమార్తెలు మీరా (26), రేఖ (20)లను సోమవారం గొడ్డలితో నరికి చంపాడు. మీరా, రేఖలను కాపాడేందుకు ప్రయత్నించిన భార్య, మనవడిపై కూడా దాడి చేశాడని నాగౌర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ రామమూర్తి జోషి తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అతని కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనారామ్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.