AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Suicide: విషాదం.. మూడు నెలల చిన్నారి స‌హా దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌..

మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు మృతుల బంధువులు. స్థానికులను ఆరా తీశారు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Family Suicide: విషాదం.. మూడు నెలల చిన్నారి స‌హా దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌..
Suicide
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2023 | 8:19 PM

Share

అమ్మంటే నిజం..నాన్నంటే నమ్మకం.. అమ్మానాన్నే కదా చిన్నారుల లోకం… కానీ కంటికి రెప్పలా పెంచాల్సిన కన్నప్రేమే యమపాశమవుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ కుషాయిగూడలో ఇద్దరు చిన్నారుల భవితను చిదిమేసి తల్లిదండ్రుల ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆపై వాళ్లూ సూసైడ్‌ చేసుకున్నారు. కందిగూడలో జరిగిన ఈ ఘటన అందర్నీ కన్నీరు పెట్టించింది. పిల్లల అనారోగ్యంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బంధువులు వాపోయారు.ఈ దారుణం మరవకముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లిలో మరో విషాదం చోటు చేసుకుంది.

ముక్కుపచ్చలారని మూడు నెలల బిడ్డ సహా అశోక్‌, అతని భార్య అంకిత నట్టింట్లో శవాలయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న చేవేళ్ల సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు మృతుల బంధువులు. స్థానికులను ఆరా తీశారు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..