శివసేన కార్యకర్తలు పిస్టల్స్ చూపి బెదిరించారు, ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపణ
మహారాష్ట్రలో శివసేన కార్యకర్తల ఆగడాలు శృతి మించుతున్నాయని ఔరంగాబాద్ ఎం ఐ ఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపించారు.
మహారాష్ట్రలో శివసేన కార్యకర్తల ఆగడాలు శృతి మించుతున్నాయని ఔరంగాబాద్ ఎం ఐ ఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా ఆయన.. ఇటీవల పూణే-ముంబై హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ ను బెదిరించేందుకు శివసేన కార్యకర్తలు తమ వాహనం నుంచి రివాల్వర్లు చూపి బెదిరించారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. తమ వాహనాన్ని దాటి ఆ ట్రక్కు వెళ్తున్నందుకు ఆగ్రహించిన వారు ఈ బెదిరింపులకు దిగినట్టు కనిపిస్తోందన్నారు. ఆ వాహనంపై శివసేన పార్టీ చిహ్నం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తాము దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు జలీల్ పేర్కొన్నారు. కాగా- దీనిపై దర్యాప్తు జరిపిస్తామని సేన అధికార ప్రతినిధి అరవింద్ సావంత్ ప్రకటించారు. ఈ వాహనంలో ఎవరు ప్రయాణిస్తున్నారు, ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ తదితరాలను తెలుసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.
పార్టీ పేరు చెప్పి ఎవరు ఈ విధమైన బెదిరింపు చర్యలకు దిగినా తాము సహించబోమన్నారు. అటు- గత సెప్టెంబరులో రిటైర్డ్ నేవీ అధికారిపై శివసేన గూండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపించిన విషయాన్ని జలీల్ గుర్తు చేశారు. సీఎం ఉధ్ధవ్ థాక్రే క్యారికేచర్ ని వ్యంగ్యంగా వేసినందుకు ఆ అధికారి ఇంటికి వెళ్లి ఆయన వెంటబడి తరిమి వారు కొట్టారు.
@AnilDeshmukhNCP @DGPMaharashtra @OfficeofUT this is on Pune Mumbai expressway in Maharashtra.! The logo on the vehicle says it all! Shiv Sainiks brandishing revolvers while trying to make way for their vehicle on Friday night. Can HM/ DG take note of this lawlessness.! pic.twitter.com/HIPZF0AN2z
— imtiaz jaleel (@imtiaz_jaleel) January 29, 2021