AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడి దారుణ హత్య.. అతని ఇంట్లోనే 12 ముక్కలుగా నరికి, పాలిథీన్‌ సంచుల్లో కుక్కి..

ఓ యువకుడిని అతని ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, 12 ముక్కలుగా నరికారు. అనంతరం శరీర భాగాలను పాలిథీన్ కవర్లలో కుక్కి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో బోలింగర్ జిల్లాలో బుధవారం (మే 17) చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం...

యువకుడి దారుణ హత్య.. అతని ఇంట్లోనే 12 ముక్కలుగా నరికి, పాలిథీన్‌ సంచుల్లో కుక్కి..
Odisha Crime
Srilakshmi C
|

Updated on: May 18, 2023 | 6:20 PM

Share

ఓ యువకుడిని అతని ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, 12 ముక్కలుగా నరికారు. అనంతరం శరీర భాగాలను పాలిథీన్ కవర్లలో కుక్కి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో బోలింగర్ జిల్లాలో బుధవారం (మే 17) చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం..

మృతుడిని రింకు మెహర్‌ (27)గా పోలీసులు గుర్తించారు. బోలింగర్ జిల్లాలోని సలేపలి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో తల్లిదండ్రులు, తమ్ముడుతో కలిసి రింకు మెహెల్‌ నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న రింకు, 20 రోజుల క్రితం తల్లిదండ్రులపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. అనంతరం వారిని బుర్లా మెడికల్‌ సెంటర్‌లో చికిత్స నిమిత్తం జాయిన్‌ చేశాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన రింకు తమ్ముడు కూడా ఆదృశ్యమయ్యాడు. రింకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులు లోపలినుంచి గొళ్లెం పెట్టి ఉండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. 7 పాలిథిన్‌ బ్యాగుల్లో రింకు శరీర భాగాలను నీట్‌గా సర్ది ఉండటం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే యువకుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నిందితులు నరికి ఉంటారని వారు భావిస్తున్నారు.

‘పథకం ప్రకారం జరిగిన హత్యగా తెలుస్తోంది. మృతుడి కుటుంబ సభ్యుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రింకూకి తల్లిదండ్రులతో గొడవలు ఉన్నాయని తెలిసింది. అందుకే ఈ కేసులో వారి ప్రమేయం ఏమైనా ఉందా లేదా మరేదైనా కారణం వల్ల హత్య జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటామని’ బోలంగీర్ సబ్ డివిజనల్ పోలీస్‌ అధికారి తోఫాన్ బాగ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.