AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూలుకు బాంబు బెదిరింపు.. బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు.. ఒకరు అరెస్ట్

తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు దొరకలేదు. బాంబు పెట్టామని దుండగుడు ఫోన్ చేయడం ఇది రెండోసారని స్కూలు యాజమాన్యం తెలిపింది. అంతేకాదు తన ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సైతం దుండగుడు స్కూలుకు పంపించాడని చెప్పింది.

అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూలుకు బాంబు బెదిరింపు.. బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు.. ఒకరు అరెస్ట్
Dhirubhai Ambani School
Surya Kala
|

Updated on: Jan 12, 2023 | 12:56 PM

Share

ఓ ఆగంతకుడు ధీరూబాయ్‌ అంబానీ అండ్‌ టీమ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో టైమ్ బాంబ్ పెట్టానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్‌ చేసి బెదిరించాడు. జనవరి 10న స్కూలును పేల్చేస్తానంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌తో స్కూల్‌ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూలు యాజమాన్యం. దాంతో వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు పోలీసులు. అయితే బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఇలా దుండగులు స్కూల్లో బాంబు పెట్టామంటూ ఫోన్‌ చేయడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు ముందుకూడా ఇలా ఫోన్‌చేసి బెదిరించారని స్కూలు జాజమాన్యం తెలిపింది. అంతేకాదు, తదుండగుడు తన ఆధార్‌, పాన్‌ కార్డ్‌ వివరాలను సైతం స్కూలుకు పంపించాడని, అతని పేరు విక్రమ్‌ సింగ్‌ అని తెలిపారు. అతను పంపిన ఆధారాను బట్టి అగంతకుడు గుజరాత్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. పాపులారిటీ కోసమే ఇలా చేసి ఉంటాడని స్కూలు యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు దొరకలేదు. బాంబు పెట్టామని దుండగుడు ఫోన్ చేయడం ఇది రెండోసారని స్కూలు యాజమాన్యం తెలిపింది. అంతేకాదు తన ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సైతం దుండగుడు స్కూలుకు పంపించాడని చెప్పింది. అతని పేరు విక్రమ్ సింగ్ అని, గుజరాత్ కు చెందిన అతను పాప్యులారిటీ కోసం ఇలా చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్కూలు యాజమాన్యం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..