AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సీఎం రాజీనామాకు ముందు కీలక నిర్ణయం.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి..

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు గ్రూపులో ఎమ్మెల్యేల సంఖ్య గంట గంటకు పెరుగుతుంటే.. సేన చీఫ్‌ షాక్‌లో కూరుకు పోయారు..

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సీఎం రాజీనామాకు ముందు కీలక నిర్ణయం.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి..
Subhash Goud
|

Updated on: Jun 23, 2022 | 8:10 AM

Share

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు గ్రూపులో ఎమ్మెల్యేల సంఖ్య గంట గంటకు పెరుగుతుంటే.. సేన చీఫ్‌ షాక్‌లో కూరుకు పోయారు. ఇప్పటికే అసహనానికి గురైన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే అధికార సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. అటు.. తిరుగుబాటు నేత, మంత్రి ఏక్​నాథ్ షిండే మాట్లాడుతూ.. మహా అఘాడి కూటమి నుంచి శివసేన బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. అర్ధరాత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. వర్ష బంగ్లా నుంచి తన లగేజీతో పాటు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శివసేన కార్యకర్తలు, నేతలు కంట నీరు పెట్టుకున్నారు. అధికార బంగ్లాను ఖాళీ చేయొద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు.

రాజకీయాల్లో గందరగోళం నెలకొనడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. అటు.. ఈ పరిణామాలపై స్పందించిన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే.. కూటమి నుంచే బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు నుంచి బయటపడటం ఎంతో అవసరమన్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసంగించిన తర్వాత.. షిండే ట్విట్టర్‌లో స్పందించారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్‌, ఎన్సీపీలే లబ్ధి పొందాయని.. శివసైనికులు మునిగిపోయారన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, దీనికి ముందు, ఏక్నాథ్ షిండే, థాకరేకు సమాధానమిస్తూ, గత రెండున్నరేళ్లలో, MVA ప్రభుత్వంలో మిత్రపక్షాలు మాత్రమే లబ్ధి పొందాయని, శివసేన, శివసైనికులు నష్టపోయారని అన్నారు. ఈ సమయంలో, మిత్రపక్షాలు బలపడగా, శివసేన, శివసైనికులు బలహీనపడ్డారు. మిత్రపక్షాలు బలపడుతుండగా, శివసేన-శివసేన క్రమపద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నాయి. పార్టీ, శివసైనికుల మనుగడ కోసం, అసాధారణమైన ఫ్రంట్ నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి.

క్షణక్షణం కొత్త కొత్త మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!