AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతకు తెగించార్రా..! మేల్కుంటే దాడి చేసేందుకు సిద్ధం.. 4నిమిషాల్లో రిటైర్డ్ జడ్జి ఇల్లు లూటీ!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండోర్ నగరంలో గత నెలలో వివిధ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో సుమారు 38 దొంగతనాలు జరిగాయి. తాజాగా దొంగలు ఒక రిటైర్డ్ జడ్జి ఇంట్లో దొంగతనం చేశారు. ఆ సమయంలో ఇంట్లో చాలా మంది ఉన్నారు. ముసుగు ధరించిన వ్యక్తులు గ్రిల్‌ను కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించి సులభంగా దొంగతనం చేశారు.

ఎంతకు తెగించార్రా..! మేల్కుంటే దాడి చేసేందుకు సిద్ధం.. 4నిమిషాల్లో రిటైర్డ్ జడ్జి ఇల్లు లూటీ!
Man Sleeping While Thieves Stealing
Balaraju Goud
|

Updated on: Aug 14, 2025 | 6:58 PM

Share

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండోర్ నగరంలో గత నెలలో వివిధ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో సుమారు 38 దొంగతనాలు జరిగాయి. తాజాగా దొంగలు ఒక రిటైర్డ్ జడ్జి ఇంట్లో దొంగతనం చేశారు. ఆ సమయంలో ఇంట్లో చాలా మంది ఉన్నారు. ముసుగు ధరించిన వ్యక్తులు గ్రిల్‌ను కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించి సులభంగా దొంగతనం చేశారు. దొంగలు లక్షల విలువైన నగదుతో పాటు నగలను దోచుకున్నారు. ఈ దొంగతనం సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీ షాక్‌కు గురి చేసింది.

ఒక వ్యక్తి మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ముసుగు ధరించిన వ్యక్తులు దొంగతనానికి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ఒకడు నిద్రపోతున్న వ్యక్తి వైపు ఇనుప రాడ్‌తో గురిపెట్టాడు. ముసుగు ధరించిన మరొక వ్యక్తి అల్మారాను పగలగొట్టి, అందులోని సొమ్మంతా దోచేశాడు. ఇండోర్‌లోని ప్రగతి పార్క్ కాలనీలో ఆదివారం (ఆగస్టు 10) తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన కొంతమంది దొంగలు రిటైర్డ్ జడ్జి రమేష్ గార్గ్ ఇంట్లోకి చొరబడ్డారు. ఈ సమయంలో ఇంట్లో ప్రజలు నిద్రపోతున్నారు. దొంగలు అల్మారాను పగలగొట్టిన గదిలో కూడా సీసీటీవీ ఏర్పాటు చేశారు. ఈ సీసీటీవీ ఇప్పుడు బయటపడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దొంగతనం జరిగిన మొత్తం సంఘటన ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. ఇందులో దుండగులు ఇనుప గ్రిల్‌ను కత్తిరించి లోపలికి ప్రవేశించి, ఆపై ఒక గదిలోకి వచ్చారు. తలుపు వద్ద ముసుగు ధరించిన వ్యక్తి కనిపించాడు. మరో ఇద్దరు లోపలికి వచ్చారు. ఆ సమయంలో రిటైర్డ్ న్యాయమూర్తి కొడుకు మంచం మీద నిద్రపోతున్నాడు. ముసుగు ధరించిన వ్యక్తి, అతని ముందు ఇనుప రాడ్‌తో దాడి చేసేందుకు నిలబడి ఉన్నాడు. అతను మేల్కొంటే అతనిపై దాడి చేస్తానన్నట్లుగా.. ఇక మూడవ ముసుగు ధరించిన వ్యక్తి మొదట అల్మారా తాళాన్ని పగలగొట్టి, ఆపై నగదు, నగలను దోచేశాడు. దొంగతనం సమయంలో సైరన్ శబ్దం కూడా వినపడింది. ఈ ముసుగు ధరించిన దుండగులు కొన్ని నిమిషాల్లో సుమారు 5 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పారిపోయారు.

ఇండోర్‌లో ఆదివారం, సోమవారం రాత్రి ఒకేసారి అనేక దొంగతనాలు జరిగాయని డీఎస్పీ ఉమాకాంత్ చౌదరి తెలిపారు. నగరంలో దొంగల ముఠా మకాం వేసిందని. రిటైర్డ్ జడ్జి పేరు చెప్పకుండానే, సిమ్రాల్, ఖుదైల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలతో పాటు, నగరంలోని ఇతర పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో అనేక దొంగతనాలు జరిగాయని ఆయన అన్నారు. సిమ్రాల్ కాలనీలో, ఒకేసారి 4 ఇళ్ల తాళాలు పగలగొట్టారు. ప్రగతి పార్క్‌లో జరిగిన దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు కూడా దొరికాయి. ఈ ముసుగు దొంగల కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..