AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3rd Phase Polls: మూడో దశలో 65.68% ఓటింగ్.. 4 రోజుల తర్వాత తుది పోలింగ్‌ విడుదల చేసిన ఈసీ

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఎన్నికల సంఘం మొత్తం ఓటింగ్ శాతం గణాంకాలను విడుదల చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మూడో దశలో మొత్తం 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే మే 7న సాయంత్రం కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం మూడో దశలో 64.40 శాతం ఓటింగ్ జరిగింది. కానీ నాలుగేళ్ల తర్వాత ఈ సంఖ్య ఒక శాతం ఎక్కువ ఓటింగ్‌ నమోదైంది.

3rd Phase Polls: మూడో దశలో 65.68% ఓటింగ్.. 4 రోజుల తర్వాత తుది పోలింగ్‌ విడుదల చేసిన ఈసీ
Election Commission Of India
Balaraju Goud
|

Updated on: May 11, 2024 | 5:46 PM

Share

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఎన్నికల సంఘం మొత్తం ఓటింగ్ శాతం గణాంకాలను విడుదల చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మూడో దశలో మొత్తం 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే మే 7న సాయంత్రం కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం మూడో దశలో 64.40 శాతం ఓటింగ్ జరిగింది. కానీ నాలుగేళ్ల తర్వాత ఈ సంఖ్య ఒక శాతం ఎక్కువ ఓటింగ్‌ నమోదైంది.

2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ మే 7న ముగిసింది. ఈ రోజు 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం మూడో దశలో పురుషుల ఓటింగ్ 66.89 శాతం, మహిళల ఓటింగ్ 64.41 శాతం, థర్డ్ జెండర్ ఓటింగ్ 25.2 శాతం.

మూడో దశలో అస్సాంలో 85.45 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 71.98 శాతం, బీహార్‌లో 59.15 శాతం, గుజరాత్‌లో 76.06 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 77.53 శాతం, యూపీలో 57.55 శాతం, కర్ణాటకలో 71.84 శాతం, మధ్యప్రదేశ్‌లో 66.75 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఓటింగ్ శాతంతో పోలిస్తే, 2024 మూడో దశ మొత్తం ఓటింగ్ శాతంలో దాదాపు రెండు శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది.

తుది గణాంకాలను విడుదల చేయడంలో జాప్యం చేస్తున్న ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎన్నికల కమిషన్‌ తీరు సరికాదని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రశ్నించారు. డేటాను ఆలస్యంగా విడుదల చేయడం వెనుక కారణమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు ఎన్నికల్లో కమిషన్ 24 గంటల్లోనే తుది గణాంకాలను విడుదల చేసేదని, ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తోందన్నారు. అయితే ఖర్గే ప్రశ్నపై ఎన్నికల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఖర్గే చేసిన ప్రకటనలు, ఆరోపణలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కమిషన్ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ