AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakti Scheme: శక్తి యోజనకు కేటాయించిన డబ్బులు 6 నెలలకే ఖాళీ.. మహిళల ఉచిత బస్సు ప్రయాణం రద్దు కొనసాగానే..? ?

కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన శక్తి పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ఉచిత బస్సు సేవలు పొందుతున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం సిద్ధరామయ్య బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ము ఆరు నెలల్లోనే అయిపోతోందట. శక్తి యోజన కోసం కర్ణాటక సర్కార్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 2,800 కోట్లు కేటాయించింది.

Shakti  Scheme: శక్తి యోజనకు కేటాయించిన డబ్బులు 6 నెలలకే ఖాళీ.. మహిళల ఉచిత బస్సు ప్రయాణం రద్దు కొనసాగానే..? ?
Shakti Yojana Scheme
Balaraju Goud
|

Updated on: Nov 09, 2023 | 9:39 AM

Share

కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన శక్తి పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ఉచిత బస్సు సేవలు పొందుతున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం సిద్ధరామయ్య బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ము ఆరు నెలల్లోనే అయిపోతోందట. శక్తి యోజన కోసం కర్ణాటక సర్కార్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 2,800 కోట్లు కేటాయించింది. అయితే నవంబర్ 5 వరకు మహిళా ప్రయాణీకుల జీరో టిక్కెట్ల విలువ రూ.2,143 కోట్లకు చేరుకుంది ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండడంతో, బడ్జెట్‌లో కేటాయించిన నిధులు డిసెంబరు వరకు మాత్రమే వస్తాయని ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు స్పష్టం చేశాయి. అయితే ఈ పథకం ముందుకెళ్తుందా లేదా అన్నదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

శక్తి పథకం అమలులోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత ఉచిత బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని కేఎస్‌ఆర్‌టీసీ అధికారి ఒకరు తెలిపారు. కానీ ఇది జరగలేదు. సంఖ్య స్థిరంగా కొనసాగుతూనే ఉంది. శక్తి యోజనకు ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదంటున్నారు అధికారులు. టిక్కెట్ల విలువను ప్రభుత్వం ప్రతి నెలా కర్ణాటక బస్ కార్పొరేషన్లకు చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి మరిన్ని నిధులు కేటాయిస్తేనే ఆర్టీసీ మనుగడ కొనసాగుతుందంటున్నారు కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు. మరోవైపు ఈ విషయమై రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందిస్తూ.. డిసెంబర్‌లో శక్తి ప్రాజెక్టుకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. డిసెంబర్ వరకు జారీ చేసిన మొత్తం టికెట్ విలువను పరిగణనలోకి తీసుకుని మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. .

ఇదిలావుంటే గృహలక్ష్మి, అన్న భాగ్య యోజన లబ్దిదారులకు ప్రతినెలా 20వ తేదీలోగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతినెలా 10 నుంచి 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆహార, పౌరసరఫరాల, స్త్రీ శిశు సంక్షేమ శాఖలను రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..