10 February, 2026
Subhash
ఇటీవల భారతదేశం-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది సగటు భారతీయుడికి నష్టం కలిగించవచ్చు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కఠినమైన షరతు విధించారు. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం మానేయాలని.
బదులుగా అమెరికా - వెనిజులా నుండి కొనుగోళ్లను పెంచాలి. భారతదేశం అలా చేయడంలో విఫలమైతే, ట్రంప్ మళ్ళీ 25 శాతం సుంకం విధిస్తామని బెదిరించాడు.
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం అమెరికా ప్రతిపాదనను పూర్తిగా అంగీకరిస్తే, ఇది పెట్రోల్, డీజిల్ ధరలను ఎంత ప్రభావితం చేస్తుంది?
భారతదేశం తన మొత్తం చమురు అవసరాలలో దాదాపు 85 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి ఇప్పటికే చమురు కొనుగోలు చేయడం భారత్ తగ్గించింది.
ఇటీవలి సంవత్సరాలలో రష్యా దేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. భారతదేశం మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా మాత్రమే దాదాపు మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది.
అమెరికా, వెనిజులా నుంచి కొంటే బ్యారెల్కు కనీసం $7 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ ఖర్చులు కూడా పెరగనున్నాయి
దీని వల్ల పెట్రోల్ దిగుమతి చేసుకునే కంపెనీలకు అదనపు ఖర్చు అవుతుంది. దీంతో పెట్రోల్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.