AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోందన్న వార్తలపై స్పందించిన ఐఆర్‌సీటీసీ.. మాకు ఆ ఉద్దేశం లేదంటూ..

IRCTC: దేశంలో మెజారిటీ రైల్వే టికెట్లను విక్రయిస్తోన్న ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పారేషన్‌ (IRCTC) ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే...

IRCTC: ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోందన్న వార్తలపై స్పందించిన ఐఆర్‌సీటీసీ.. మాకు ఆ ఉద్దేశం లేదంటూ..
Irctc
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 20, 2022 | 4:21 PM

Share

IRCTC: దేశంలో మెజారిటీ రైల్వే టికెట్లను విక్రయిస్తోన్న ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పారేషన్‌ (IRCTC) ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ప్రయాణికుల డిజిటల్‌ డేటాను మానిటైజ్‌ చేయడం ద్వారా రూ. 1000 కోట్లు ఆర్జిండమే లక్ష్యంగా పెట్టుకుందని ఇందుకోసం ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోందని వార్తలు వచ్చాయి. సంప్రదాయ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలోనూ కథనాలు హల్చల్‌ చేశాయి.

అయితే ఈ వ్యవహారంపై ఐఆర్‌సీటీసీ ఎట్టకేలకు అధికారికంగా స్పందించింది. మీడియాలో, సోషల్‌ మీడియాల్లో వస్తోన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని ఖండించింది. ఐఆర్‌సీటీసీకి చెందిన ముఖ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మేము డేటాను విక్రయించడం లాంటివి చేయడం లేదు, మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. మీడియాలో వస్తోన్న వార్త కథనాలు పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మరింత మెరుగు పరచడానికి మాత్రమే కన్సల్టెంట్స్‌ను నియమించుకుంటాము’ అని తెలిపారు. అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ తమ వినియోగదారుల డేటాను స్టోర్‌ చేసుకోదు. పేమెంట్ చేసే సమయంలోనూ ఆయా బ్యాంకుల పేమెంట్‌ గేట్‌వేలకు సమాచారం బదిలీ అవుతుంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ నియమించుకున్న కన్సల్టెన్సీ కేవలం తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవడం కోసమేనని తేల్చి చెప్పింది. దీంతో గత రెండు రోజులు వస్తోన్న వార్తలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది.

ఇదిలా ఉంటే ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం ఏకంగా 10 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ సంస్థ కొత్తగా కన్సల్టెన్సీని నియమించుకోవడంతో ప్రయాణికుల డేటాను మానిటైజ్‌ చేస్తోందని, డేటాను ఇతర ప్రైవేట్‌ కంపెనీలకు విక్రయిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. కన్సల్టెన్సీల కోసం ఏకంగా ఈ టెండర్‌ను కూడా ఆహ్వానించింది అంటూ పుకార్లు షికార్లు చేయడంతో ఐఆర్‌సీటీసీ అధికారికంగా స్పందించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..